ఒంగోలులో దాహం కేకలు- తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 8:06 PM IST

thumbnail

Drinking Water Problem in Prakasam District : తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లాలో ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దోర్నాల మండలం చింతల అగ్రహారం, పెద్దారవీడు మండలం కర్రోల, వైడిపాడు గ్రామాల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయించి ఆందోళనలకు దిగారు. యర్రగొండపాలెం నుంచి దోర్నాల వెళ్తున్న వైసీపీ ఇన్‌ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ వాహనాన్ని స్థానికులు అడ్డుకుని, తాగు నీటి సమస్యపై ఆయన్ను నిలదీశారు. వారం రోజులుగా నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Women Protest on Road : మూడు రోజులకు ఒకసారి స్నానాలు చేస్తున్నామని వాపోయారు. కనీసం నీళ్లు కొనుగోలు చేద్దామన్న దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమైతే వస్తారుగాని సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు రారని మహిళలు మండిపడ్డారు. నీటి ట్యాంకర్లు సైతం నిలిపివేయడంతో సమస్య మరింత జటిలమైందని వాపోయారు. కనీసం ట్యాంకర్లు కూడా సరఫరా చేయలేకపోతే ఇక ప్రజా ప్రతినిధులు ఉండి ఏం లాభామన్నారు. నీటి సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.