రాజకీయ లబ్దికోసమే పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది : సీపీఐ రామకృష్ణ - CPI RAMAKRISHNA FIRE ON YSRCP GOVT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:14 PM IST

thumbnail

CPI Ramakrishna Fire on YCP Government due to Pension Issue : సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లను ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మే నెల ఫించన్ల పంపిణీలో లబ్ధిదారులను మరో సారి ఇబ్బందులకు గురిచేసేవిధంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బ్యాంకుల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. దీనికోసం మెుదట ఫించన్ లబ్ధిదారులు సచివాలయాల వద్ద సమాచారం తెలుసుకుని, తరువాత బ్యాంకులకు వెళ్లి పెన్షన్ సొమ్మును తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమన్నారు. ఫించన్ అందించడానికి వారిని ఇంతలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. 

వృద్ధులను ఇబ్బంది పెట్టి తద్వారా ఈ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ సర్కార్ వేసిన పన్నాగమని విమర్శించారు. అందుకు కొందరు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాలంటీర్లతో కాకుండా ప్రత్యమ్నయంగా ఫించన్లు పంపిణీ చేయమని మాత్రమే ఈసీ ఆదేశించిందని గుర్తుచేశారు. కాని జగన్ సర్కార్ ఫించన్ దారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని ప్రతిపక్షలపై వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తద్వారా ఎన్నికల్లో రాజకీయ లబ్థిపోందేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రామకృష్ణ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.