ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు- వేదపండితుల ఆశీర్వచనం - JAGAN bharathi UGADI CELEBRATIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 4:36 PM IST

thumbnail

CM Jagan bharathi Ugadi Festival Celebrations: తెలుగు వారి తొలి పండుగ ఉగాది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ శావల్యాపురం మండలం గంటవారిపాలెంలోని ఉగాది వేడుకలు జరుపుకొన్నారు. గంటావారిపాలెంలోని ముఖ్యమంత్రి బస కేంద్రంలో జగన్, భారతి దంపతులిద్దరూ ఉగాది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వేద పండితులు, అర్చకులు తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ దంపతులకు ఆశ్వీర్వచనాలు అందజేశారు. పూజ అనంతరం అర్చకులు ఇచ్చిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు శుభాలు, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.