జగన్​ పతనం ప్రారంభమైంది - ఈవీఎంలు మారుస్తారనే అనుమానం ఉంది: చింతా మోహన్‍ - Chinta Mohan comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 8:42 PM IST

thumbnail
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‍ (ETV Bharat)

Chinta Mohan Sensational Comments on YSRCP: ముఖ్యమంత్రి వైఎస్  జగన్‍ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, వ్యవస్ధలన్నీ నాశనం చేశారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‍ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జగన్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్‍ పతనం ప్రారంభమైందని, మళ్లీ తిరిగి అధికారంలోకి రారని తెలిపారు. పోస్టల్‍ బ్యాలెట్‍ ద్వారానే ప్రజా నాడి తెలిసిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రాక్షస పాలన పోయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు.

 వైఎస్సార్సీపీ ఎన్నికల్లో సుమారు 4 వేల నుంచి 5 వేల కోట్ల రూపాయలు  ఖర్చు పెట్టిందని చింతా మోహన్‍ ఆరోపించారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్‍ కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నారు. ఎన్నికల కమీషన్‍ ఇవేమీ పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిందని చింతా పేర్కొన్నారు. ఈవీఎంలు మారుస్తారన్న అనుమానం ఉందని, స్ట్రాంగ్‍ రూముల వద్దకు వెళ్లకూడదని చెబుతున్నారన్నారని పేర్కొన్నారు. పోలీస్‍ వ్యవస్ధ నాశనమైపోయిందని, పోలీసులే దగ్గరుండి మరీ డబ్బులను పంచారని ఆరోపించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.