LIVE: గోపాలపురంలో చంద్రబాబు ప్రజాగళం - ప్రత్యక్ష ప్రసారం - CHANDRABABU PRAJAGALAM LIVE
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 8:32 PM IST
|Updated : Apr 4, 2024, 9:25 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-04-2024/640-480-21147288-thumbnail-16x9-cbn-live.jpg)
Chandrababu Prajagalam Live in Gopalapuram : ప్రజాగళం రెండో విడతలో భాగంగా చంద్రబాబు మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ప్రజాగళం పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాకా ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. ఈరోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అనంతరం కొవ్వూరు ప్రజాగళం యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత గోపాలపురంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6వ తేదీన పెదకూరపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించనున్నారు. రోజూ సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం జరిపేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్షోలలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం గోపాలపురంలో చంద్రబాబు ప్రజాగళం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.