దూకుడు పెంచిన ఎన్డీఏ కూటమి- నేటి నుంచి చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం - CBN Pawan Joint Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 10:54 AM IST

thumbnail

Chandrababu And Pawan Joint Election Campaign: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూకుడు పెంచింది. ఎన్డీఏలో ఆయా నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సభ తప్ప మూడు పార్టీ నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభల్లో ఒకే వేదికను పంచుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నేటి నుంచి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల అధినేతలు కలసి ఉమ్మడిగా రోడ్ షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. ప్రజాగళం మూడో విడతలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నేడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని తణుకు, నిడదవోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.