LIVE: పులివెందుల నియోజకవర్గ పరిధిలో వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం- ప్రత్యక్షప్రసారం - YS Sharmila Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 8:01 PM IST

Updated : May 9, 2024, 8:57 PM IST

thumbnail

YS Sharmila Election Campaign Live: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. మిగిలిన తక్కువ సమయంలో ముఖ్యనేతలను రప్పించి పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా అన్ని పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ జిల్లాలో షర్మిల, సునిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించి న్యాయానికి ప్రాణం పోయాలని కడప ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఒక వైపు వైఎస్సార్ బిడ్డ మరో వైపు వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి ఉన్నాడని, ఎవరికి ఓటు వేయాలో పులివెందుల ప్రజలు తెలుసుకోవాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం పులివెందుల నియోజవర్గంలో విస్తృత ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : May 9, 2024, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.