LIVE: ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 3:09 PM IST
|Updated : Mar 20, 2024, 3:59 PM IST
AP CEO Mukesh Kumar Meena Media Conference Live: ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాష్ట్ర అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఎస్ కేఎస్. జవహర్ రెడ్డి(AP CS KS Jawahar Reddy) సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లుపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కెఎస్. జవహర్ రెడ్డి, డీజీపీ కేవి.రాజేంద్రనాధ్ రెడ్డి, సీఈవో ముకేశ్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యునికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ, సీఈవోతో పాటు వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.