ETV Bharat / state

నీ రాక - మాకో శాపం స్వామీ! 'ఆడుదాం ఆంధ్రా' ముగింపుతో జనం ఉక్కిరిబిక్కిరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 6:58 AM IST

Updated : Feb 14, 2024, 2:20 PM IST

Traffic Problems due to CM YS Jagan: 'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో క్రీడాకారులు ఆడారో లేదో గానీ ముగింపు వేడుకలకు విశాఖకు వచ్చిన జగన్‌ మాత్రం జనాలతో ఓ ఆట ఆడుకున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ తన సభ కోసం తరలించుకుని ప్రయాణికులను అవస్థలకు గురి చేశారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఒక పూటంతా ట్రాఫిక్‌ నిలిచి నగర వాసులకు నరకం చూపించారు. నాలుగున్నరేళ్లలో క్రీడాకారులను ఆటలో అరటి పండుగానే చూసిన జగన్‌ ఎన్నికల ముందు మట్టిలో మాణిక్యాలను తీసుకొస్తానని ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఆరంభ శూరత్వమే చూపారు.

Traffic_Problems_due_to_CM_YS_Jagan
Traffic_Problems_due_to_CM_YS_Jagan

నీ రాక - మాకో శాపం స్వామీ! 'ఆడుదాం ఆంధ్రా' ముగింపుతో జనం ఉక్కిరిబిక్కిరి

Traffic Problems due to CM YS Jagan : రాష్ట్రంలో సీఎం జగన్‌ ఎక్కడ పర్యటించినా ఆ ప్రాంత ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. 'ఆడుదాం ఆంధ్రా (Adudam Andhra)' ముగింపు వేడుక విశాఖ నగరవాసులుకు తలనొప్పి తెచ్చిపెట్టింది. జగన్‌ రాక సందర్భంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం వస్తున్నారనే సమాచారంతో ఉదయం నుంచే వాహనాలను, బస్సు సర్వీసులను నిలిపివేసి జనాలకు చుక్కలు చూపించారు. వందల సంఖ్యలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర పరిధిలో సిటీ సర్వీసులు తగ్గిపోవడంతో ఆటోల్లోనే నగరవాసులు రాకపోకలు సాగించారు.

Adudam Andhra Final in Visakhapatnam : సీఎం సభ కోసం తీసుకొచ్చిన బస్సులు జాతీయ రహదారిపై పార్కింగ్ చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పీఎంపాలెం స్టేడియం సమీపంలో జాతీయ రహదారిపై రెండువైపులా సుమారు నాలుగు గంటలు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ చిక్కుకుపోయినా పోలీసులు ఆ వాహనానికి దారి చూపించే ప్రయత్నం చేయలేదు. జగన్‌ సాయంత్రం 5 గంటల సమయంలో ఐటీ హిల్స్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఐటీ సంస్థల నుంచి విధుల ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

సీఎం పర్యటనతో సామాన్యులకు ట్రాఫిక్ కష్టాలు - మీసం మెలేస్తూ హెచ్చరించిన కానిస్టేబుల్

CM YS JaganVisit Visakhapatnam : సీఎం కార్యక్రమం కోసం జనాలను బలవంతంగా తరలించినా స్టేడియంలోకి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపలేదు. స్డేడియంలోకి వెళితే గేట్లు వేసేస్తారని చాలామంది గ్యాలరీల్లోకి వెళ్లకుండా సీఎం రాకముందే జారుకున్నారు. దీంతో కొన్ని గ్యాలరీలు పలచగా కనిపించాయి. స్టేడియంలోకి వచ్చినవారు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా జీవీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. మెయిన్‌గేట్‌ నుంచి వీవీఐపీలను తప్ప వైసీపీలో ముఖ్య నాయకులనూ అనుమతించలేదు. దీంతో కొంతమంది నాయకులు గేటు బయటే ఉండిపోయారు. మరోవైపు సీఎం జగన్‌ రాకతో పలువురిని పోలీసులు ముందస్తు అరెస్టులు నిర్బంధాలు చేశారు. జనసేన నాయకుడు, కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ను పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకుని ఎంవీపీ స్టేషన్‌కు తరలించారు.

పండగవేళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన- ముందు రోజు నుంచే విధిస్తున్న ఆంక్షలతో హడలెత్తుతున్న జనాలు

ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో సీఎం జగన్‌ మైదానంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఖాళీ గ్యాలరీలు చూసి ఖంగుతిన్నారు. మైదానం చుట్టూ ఓపెన్‌ టాప్‌ జీపులో అభివాదం చేసి ఆటలు పోటీలను వీక్షించాల్సి ఉంది. కానీ జనాల్లేని స్టేడియం చూసి అధికారులు, నాయకులపై జగన్‌ అసహనం వ్యక్తం చేశారు. స్డేడియం చుట్టూ తిరగకుండానే నేరుగా వేదికపైకి వెళ్లిపోయారు. ముభావంగానే తన సందేశాన్ని సైతం అందించారు.

స్డేడియం సామర్థ్యం దాదాపు 25వేలు కాగా 30వేల మందితో ముగింపు వేడుకలు జరపాలని ప్రణాళిక చేశారు. ఇందుక మెప్మా మహిళలను వార్డుల వారీగా తరలించాలని జీవీఎంసీ లక్ష్యం విధించింది. బస్సుల్లో మైదానం వరకు తరలించినా, చాలా మంది స్డేడియం బయట నుంచే వెనుదిరిగారు. లేజర్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు వరకు ఉన్న ఆ కొద్ది మంది జగన్‌ ప్రసంగం ప్రారంభించిన 2 నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు.

పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన-ఎప్పటిలాగే ఆంక్షలు విధించిన ప్రభుత్వం-బోనస్​గా విద్యార్థులకు సెలవు ప్రకటన!

Last Updated :Feb 14, 2024, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.