ETV Bharat / state

'గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకానికి మాకు అన్ని అర్హతలూ ఉన్నాయ్!'

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 9:35 AM IST

Telangana Governor Quota MLC Issue : తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకానికి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌ల తరపు న్యాయవాది సోమవారం హైకోర్టుకు నివేదించారు. గతంలో తమ అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది.

Governor Quota MLC Case in High Court
Telangana Governor Quota MLC Issue

Governor Quota MLC Case in High Court : గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకానికి తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌ల తరపు న్యాయవాది సోమవారం హైకోర్టుకు నివేదించారు. మంత్రిమండలి సిఫార్సు మేరకే ఎమ్మెల్సీలుగా గవర్నర్‌ నియమించారన్నారు. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు నామినేట్‌ చేసింది. అయితే, ఆ ప్రతిపాదనలను గవర్నర్‌ తిరస్కరించిన విషయం విధితమే. ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్​లను నామినేట్ చేయగా గవర్నర్ ఆమోదించించడంతో దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణలు అప్పట్లో హైకోర్టును సంప్రదించారు.

12 మంది ఐపీఎస్‌ల బదిలీ- రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి

High Court Hearing On Governor Quota MLC Petition : గతంలో గవర్నర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది. ప్రతివాదులైన కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌ల తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ సోమవారం వాదనలను కొనసాగిస్తూ పిటిషనర్లు తమ అభ్యర్థనలను సవరిస్తూ జనవరి 27న ప్రభుత్వం జారీచేసిన జీవో 12, 13లను కొట్టివేయాలని కోరారన్నారు. జెంటిల్‌మెన్‌ ఒప్పందానికి విరుద్ధంగా నియామకాలు చేపట్టారని, అందువల్ల జీవోలను కొట్టివేయాలని కోరడం సరికాదన్నారు. మంత్రిమండలి సిఫార్సు మేరకే నియామకం జరిగిందన్నారు.

Telangana Governor Quota MLC Issue : అంతేకాకుండా తమను ఎమ్మెల్సీలుగా నియమించాలని సొంతంగా కోరే హక్కు ఎవరికీ ఉండదని తెలిపారు. మంత్రి మండలి సిఫార్సుల మేరకు గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని, అయితే మంత్రి మండలి చేసే సిఫార్సులను పరిశీలించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉందని తెలిపారు. దీనికి సంబంధించి పలు కోర్టులు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు. మంత్రి మండలి సిఫార్సులను సెప్టెంబరులో గవర్నర్‌ తిరస్కరించారని, దాని తర్వాత డిసెంబరులో తమ నియామక ప్రక్రియ ప్రారంభమై జనవరిలో పూర్తయిందన్నారు. సెప్టెంబరులో గవర్నర్‌ తిరస్కరించిన తరువాత వాటిని తిరిగి గవర్నర్‌కు పంపి ఉండవచ్చని, ఇక్కడ అలా జరగలేదన్నారు.

Governor Quota MLC Case in High Court : ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గవర్నర్‌ పునఃపరిశీలన చేయాలని చెప్పలేదని వీటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారని, పునఃపరిశీలన, తిరస్కరణ వేర్వేరు అంటూ వ్యాఖ్యానించింది. దీనికి న్యాయవాది సమాధానమిస్తూ తిరస్కరించినపుడు తిరిగి మంత్రిమండలి సిఫార్సు చేసి ఉండవచ్చన్నారు. మంత్రిమండలి, గవర్నర్‌ కంటే రాజ్యాంగం అత్యున్నతమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ విచక్షణాధికారం, న్యాయ సమీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలకు సంబందించి సమాధానం చెప్పడానికి పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి గడువు కోరడంతో ధర్మాసనం విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా

ప్రజాప్రతినిధుల మేడిగడ్డ టూర్ ​- షెడ్యూల్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.