ETV Bharat / state

కొత్త సీసాలో పాత సారా- వైఎస్సార్​సీపీ మేనిఫెస్టోపై టీడీపీ ఎద్దేవా - TDP Criticized to YCP manifesto

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 8:09 PM IST

Updated : Apr 27, 2024, 8:28 PM IST

Etv Bharat
Etv Bharat

TDP Leaders Criticized to YCP Manifesto : జగన్ మోహన్ రెడ్జి ప్రకటించిన మేనిఫెస్టోపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కొత్త సీసాలో పాత సారాలా వైసీపీ మేనిఫెస్టో ఉందని ఎద్దేవాచేశారు. కేవలం రెండు మూడు పథకాల్లో ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమ అనిపించారని మండిపడ్డారు. వారి మేనిఫెస్టోను చూసిన వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు.

TDP Leaders Criticized to YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఎప్పుడు ఆడే అబద్దాలనే జగన్ రెడ్డి మళ్లీ తమ మేనిఫెస్టోలో వల్లించారని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, గతంలోలానే రెండు పేజీల మేనిఫెస్టోను ప్రకటించిన జగన్ కొత్తగా చెప్పుకోదగిన హామీలేవీ ఇవ్వలేదని తెలిపారు. కేవలం రెండు మూడు పథకాల్లో ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమ అనిపించారని మండిపడ్డారు. కీలకమైన పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన సహా ఉద్యోగులకు పీఆర్సీ తదితర అంశాలపైనా మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదని విమర్శించారు.

పాత మేనిఫెస్టోకు కొత్త రంగులద్దిన వైఎస్సార్సీపీ- డ్వాక్రా, రైతు రుణాల మాఫీ ఊసేదీ!

కొత్త సీసాలో పాత సారాలా వైసీపీ మేనిఫెస్టో : అలాగే జగన్ మేనిఫెస్టోతో అవ్వాతాతలకు షాకిచ్చాడన్నారు. ఉపాధి, ఉద్యోగాల జాడ లేదని ఆక్షేపించారు. మద్య నిషేధం ఊసేలేదన్నారు. అసలు వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అనే మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి పక్కన పెట్టడని ఆరోపించారు. అమ్మ ఒడి పథకంలో మరో రెండు వేలు పెంచి ఒక బిడ్డకే ఇస్తానంటూ అమ్మలకు జగన్ షాక్ ఇచ్చాడని మండిపడ్డారు. ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికి చంద్రబాబు తల్లికి వందనం ఇస్తానన్నారని అశోక్ బాబు గుర్తుచేశారు.

జగన్ మేనిఫెస్టోతో అన్నదాతలకు షాక్ : రైతులకు కూడా వైసీపీ మేనిఫెస్టోతో నిరాశేనని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి 16వేల రూపాయలు మాత్రమే ఇస్తామంటూ ప్రకటించడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకారం అన్నదాత పథకం ద్వారా రైతుకు ఏడాదికి 20 వేల రూపాయలు లబ్ధిచేకురుతుందని స్పష్టంచేశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందన్నారు. మేనిఫెస్టోను చూసిన వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అశోక్ బాబు పేర్కొన్నారు.

వైసీపీ మేనిఫెస్టోతో వాలంటీర్లకు నిరాశ : అలాగే మద్యపాన నిషేధం చేస్తామని, చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని 2019లో మాటిచ్చిన జగన్‌ ఈసారి ఆ ఊసే ఎత్తలేదని. అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం సీపీఎస్‌ రద్దుపై పెడతామని 2019లో హామీ ఇచ్చిన జగన్‌ ఇప్పుడు దాని ప్రస్తావనే తీసుకురాలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలపై హామీ ఇస్తారని వేచిచూసిన రైతులు, మహిళలకు చివరికి నిరాశ మిగిలిందని ఎద్దేవ చేశారు. 2022లోనే పోలవరం పూర్తి చేస్తానని 2019లో చెప్పిన జగన్‌ ఈసారి మాత్రం ఐదేళ్లలో పూర్తి చేస్తామని నీతులు చెబుతున్నారన్నారు. మరోవైపు గౌరవ వేతనం పెంపుపై హామీ ఇస్తారని ఎదురు చూసిన వాలంటీర్లకు నిరాశ ఎదురైందని అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ముందు వైసీపీ మేనిఫెస్టో!: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో పాత సీసాలో పాత సారానే అని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. రాజధాని, పోలవరం ప్రస్తావన, మద్యనిషేధం వంటి మేలు చేసే అంశాలు జగన్ విస్మరించారని విమర్శించారు. కేవలం తెలుగుదేశం పార్టీ సూపర్-6 పథకాల ద్వారా లబ్ధిచేకూరుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు.

జగనన్న ఇస్తున్న పథకాలు అన్నీ ఆగిపోతాయి.. మీకు విజ్ఞత ఉండాలి! : మంత్రి ధర్మాన

ఇచ్చిన హామీని మరిచిన జగన్.. రూ.10 వేలు ఇవ్వాలంటున్న అర్చకులు

వైఎస్సార్​సీపీ మేనిఫెస్టోపై టీడీపీ ఎద్దేవా
Last Updated :Apr 27, 2024, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.