ETV Bharat / state

భానుడి భగభగ - రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం - Summer Heat Waves in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 12:43 PM IST

Summer Heat Waves in Andhra pradesh
Summer Heat Waves in Andhra pradesh

Summer Heat Waves in Andhra pradesh: రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకు తీవ్రమవుతోంది. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం మొదలవుతుండటంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Summer Heat Waves in Andhra pradesh: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదుకానుంది. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం మొదలవుతుంది. దీంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఎండలు పెరుగుతున్నాయి- ఈ నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు?: వాతవరణ శాఖ

Heat waves in Several Districts: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వివిధ జిల్లాల్లో 130 మండలాల్లో వడగాలులు విస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరి 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా 1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా వైఎస్సార్‌ జిల్లాలోని కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రాంతాల్లో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లి మండలంలో తీవ్ర వడగాలులతో ప్రజలు ఆందోళన చెందారు. జిల్లాలోని మరో 59 మండలాల్లో వడగాలులు వీచాయి. గురువారం రాష్ట్రంలో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Heat Conditions in AP: డేంజర్ బెల్స్..! రుతుపవనాల మందగమనంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు..?

మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్తు సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. రెండు వారాలుగా ఎండ తీవ్రత జనాలను భయానికి గురి చేస్తోంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. డెల్టా ప్రాంతంగా చెప్పుకొనే పశ్చిమగోదావరిలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం అధికంగా ఉన్న మన్యం ప్రాంతంలోనూ ఎండలు ఏమాత్రం తీసిపోవడం లేదు. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నగూడెంలో 37 డిగ్రీలు, గోదావరి తీరంలో ఉన్న పట్టిసీమలో 36.48 డిగ్రీలు నమోదై జిల్లా అంతటా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు.

మండుతున్న ఎండలు - మరింత పెరిగే అవకాశం - summer heat in andhra pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.