ETV Bharat / state

ఎన్నికల హింసపై విచారణకెళ్లిన పోలీసులకు షాక్- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో నాటు,పెట్రో బాంబులు - SP Bindu Madhav On Bombs Issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 6:51 PM IST

Updated : May 16, 2024, 7:04 PM IST

SP Bindu Madhav On Bombs Issue : వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో నాటుబాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు గుర్తించారు. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పోలీసులు గ్రామంలో విచారణకు వెళ్లారు. గొడవలకు బాధ్యులైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో వైఎస్సార్సీరీ గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులను గుర్తించారు .

bombs_in_ysrcp_leaders_houses_palnadu_district
bombs_in_ysrcp_leaders_houses_palnadu_district (ETV Bharat)

Bombs in YSRCP Leaders Houses Palnadu District : పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బాంబులు కలకలం సృష్టించడంతో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు ఇళ్లల్లో 55 పెట్రోలు బాంబులు, వేట కత్తులు, గొడ్డళ్లు, పగలగొట్టిన బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. వీటి వెనుక ఎవరు ఉన్నారు , బాంబులు ఎవరు తయారు చేసి విధ్వంసాలకు పాల్పడుతున్నారో వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్​కి తరలిస్తామన్నారు.


ఎన్నికల వేళ - పల్నాడు జిల్లాలో బాంబుల కలకలం - police Found Bomb in Palnadu

SP Bindu Madhav On Bombs Issue : ఎన్నికల వేళ పల్నాడులో అల్లర్లు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్​ అనంతరం సైతం ఈ గొడవలు సర్దుమనగక పోగా పెచ్చుమీరిపోవడంతో వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో వైఎస్సార్సీపీ హింసాయుధాలు వెలుగు చూశాయి. వైఎస్సీర్సీపీ నేతల ఇళ్లలో నాటుబాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు గుర్తించారు. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పోలీసులు గ్రామంలో విచారణకు వెళ్లారు. గొడవలకు బాధ్యులైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో వైఎస్సార్సీరీ గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులను గుర్తించారు . పోలింగ్‌ రోజున విధ్వంసం కోసం వైఎస్సార్సీపీ నాయకులు ఈ బాంబుల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బాంబులు వాడి ఉంటే భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగేదని పోలీసులు భావిస్తున్నారు.

పిన్నెల్లి గ్రామం మొదట్నుంచీ అత్యంత సమస్యాత్మక ప్రాంతం. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరిగాయి. గ్రామంలో ఉండలేక తెలుగుదేశం వర్గీయులు ఊరు విడిచి హైదరాబాద్‌, గుంటూరు సహా పలు ప్రాంతాలకు తరలిపోయారు. పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించలేకపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించిన తర్వాత ఇటీవలే టీడీపీ వర్గీయులు గ్రామానికి చేరుకున్నారు.

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో బాంబుల కలకలం - తనిఖీల్లో గుర్తించిన పోలీసులు - bombs in ysrcp leaders houses

బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks

బాంబులు హింసాకాండకు వైఎస్సార్సీపీ ప్రణాళికలో బాగమే (ETV Bharat)
Last Updated : May 16, 2024, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.