ETV Bharat / state

ప్రేమ కోసం పిడకల సమరం - 30 నిమిషాల పోరాటం తర్వాత వివాహం - Pidakala Festival

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 10:27 PM IST

pidakala_festival
pidakala_festival

Pidakala Festival in Kairuppala at Kurnool District: కర్నూలు జిల్లాలోని కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది సమయంలో ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది. భద్రకాళిదేవి, వీరభద్రస్వామి కోసం గ్రామస్థులు వందల ఏళ్ల క్రితం చేసిన ఈ పిడకల పోరాటాన్ని గ్రామస్థులు నేటీకీ పాటిస్తున్నారు. ఈ రోజు జరిగిన పిడకల సమరం హోరాహోరీగా సాగింది. ఈ సంగ్రామంలో 30 మంది స్వల్పంగా గాయపడ్డారు.

Pidakala Festival in Kairuppala at Kurnool District: ప్రేమికులను విడదీసిన పెద్దలను చూసుంటాం ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలనూ విని ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పోరాటమే ఒకటి సంప్రదాయంగా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో కొనసాగింది. ప్రేమికులైన వీరభద్రస్వమి, కాళికాదేవిని ఒక్కటి చేసింది.

ప్రేమ కోసం పిడకల సమరం - 30 నిమిషాల పోరాటం తర్వాత వివాహం

Dung Cakes Fighting : కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది సమయంలో ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది. పిడకల సమరం ఈ సంవత్సరం వేలాది మంది జనం సమక్షంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సమరంలో 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నందకీషోర్ రెడ్డి గుర్రంపై మందీ మార్బలం, మేళతాళాలతో కైరుప్పలకు వచ్చి ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే ఈ పిడకల సమరం మొదలైంది.

అప్పన్న ఆలయంలో పెళ్లిసందడికి శ్రీకారం- సింహాద్రినాథుడిని తాకిన సూర్యకిరణాలు - Simhadri Appanna Kalyanam

పంచాయితీ చేసి వివాహానికి అంగీకారం: వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులుగా గ్రామస్థులు విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా ప్రజలు కదిలారు. ఓసారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, ఇంకోసారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది.

తమ వర్గం వారు గెలవాలనే తపనతో మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. ఒక చోట కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు ఈ సమరం కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి విభూది అంటించుకుని వెళ్లారు. ఈ సమరం ముగిసిన తర్వాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి కాళికాదేవి, వీరభద్రస్వామి వారి వివాహానికి అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు.

అడుగడుగునా పూల పరిమళం- తిరుమలలో ఉగాది వైభవం - Ugadi Celebrations at Tirumala

అసలు కథ: త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మ వారి భక్తులు నమ్మి వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు.

ఈ విషయం తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్లవద్దని వేడుకొన్నారని స్థానికులు అంటున్నారు. స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు.

పుట్టింటి పసుపు, కుంకుమ అందుకున్న తిరుపతమ్మ- అంగరంగ వైభవంగా బండ్ల ఉత్సవం - Thirupatamma Bandla Utsavam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.