ETV Bharat / state

పంచభూతాలకు సైతం పార్టీ రంగులు పులిమే దుర్మార్గపు పాలన ఇది: పవన్ కల్యాణ్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 7:39 PM IST

Pawan_Kalyan_Reaction_Over_Woman_Murder
Pawan_Kalyan_Reaction_Over_Woman_Murder

Pawan Kalyan Reaction Over Woman Murder: రాష్ట్రంలో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు అడిగిందని ఎస్టీ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన తనను కలచివేసిందన్నారు.

Pawan Kalyan Reaction Over Woman Murder: వైసీపీ దుర్మార్గపు పాలనలో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు అద్దుతున్నారని జనసేసన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరం గ్రామానికి చెందిన బాణావత్ సామిని అనే గిరిజన మహిళ వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

ఈ దారుణ ఘటన రాష్ట్రంలో అనాగరిక పాలనకు నిదర్శనం అని పవన్ కల్యాణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే నీళ్లు తాగడానికి, గాలి పీల్చుకోవడానికి వీలుంటుందని జీవో జారీ చేయడమే మిగిలిందని ధ్వజమెత్తారు. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీవాళ్లను అడ్డుకోవడమేంటని, నీటికి కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి దురదృష్టకరమని ఆక్షేపించారు.

ఈ దురాగతంపై అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల క్రితం పల్నాడులో ఎస్టీ మహిళను చంపేశారని పవన్ గుర్తు చేశారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసేవారిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వెనకేసుకొచ్చే వారికి నా ఎస్సీ, నా ఎస్టీ అనే అర్హత ఉందా అని జనసేనాని నిలదీశారు.

వ్యక్తిపై కర్రలతో దాడిచేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు

ఇంతకీ ఏం జరిగిందంటే: తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో తాగునీటి సమస్య ఉండటంతో, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నీళ్లు పట్టుకోవటానికి బాణావత్ సామిని అనే మహిళ ట్యాంకర్ వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ వాళ్లకు నీళ్లిచ్చేది లేదంటూ వైసీపీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.

ట్యాంకర్ వచ్చింది ప్రజలందరి కోసమే కదా, మంచినీళ్లు ఇవ్వాలని సామిని నిలదీశారు. ట్రాక్టర్​ డ్రైవర్ ఆమెను బూతులు తిడుతూ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్రాక్టర్ ముందువైపు బంపర్ పొట్ట భాగం వద్ద గట్టిగా తగలడంతో సామిని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

'ఈనాడు' కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి - తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం

TDP Kinjarapu Atchannaidu Letter to CM Jagan: మరోవైపు రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజల ఎదుర్కొంటున్న అవస్థలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్​కు లేఖ రాశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటూ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితి ఉందని, సురక్షిత నీరు అందక ప్రజల ప్రాణాలు కోల్పోతున్న విషయం సీఎంకి తెలుసా అని ప్రశ్నించారు. లక్షలాదిమంది ఆస్పత్రిపాలవుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనన్నారు.

గుంటూరులో డయేరియాతో నలుగురు, కలరా వ్యాధితో ముగ్గురు మృతి చెందారని వాపోయారు. సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమన్నారు. అధికారంలో ఉండే ఈ నెల రోజులైనా జగన్‌ ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ప్రజలకు సురక్షిత నీరు అందించటంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.