ETV Bharat / state

ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ- ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్యావిధానంలో మార్పులు: లోకేశ్ - Nara Lokesh Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 12:19 PM IST

Updated : Apr 13, 2024, 8:04 PM IST

Nara_Lokesh_Election_Campaign
Nara_Lokesh_Election_Campaign

Nara Lokesh Election Campaign: యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తామని నారా లోకేశ్ ప్రకటించారు. ఏపీలో వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్ట్మెంట్ వాసులతో భేటీలో ఈ విషయాలను వెల్లడించారు.

Nara Lokesh Election Campaign: ఆంధ్రప్రదేశ్​లో వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్టుమెంట్‌ వాసులతో లోకేశ్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

పరిశ్రమలతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని సర్వనాశనం చేశారని లోకేశ్ విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. ఒక్క విద్యాసంస్థనైనా తీసుకొచ్చారా అని లోకేశ్ ప్రశ్నించారు. గంజాయికి ఏపీ అడ్డాగా మారిందని, ఇతర రాష్ట్రాలకి సైతం ఏపీ గంజాయిని తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇంటి, చెత్తపన్ను సామాన్య ప్రజలకు భారంగా మారాయని లోకేశ్‌ అన్నారు.

నాడు వద్దన్న వారే నేడు ఘన స్వాగతం పలికారు.. - Nara Lokesh election campaign

ముఖ్యమంత్రి జగన్ తన సొంత చెల్లెలలనే గౌరవించలేని వ్యక్తి అని, అలాంటి వారి పాలనలో మహిళలకు ఎలాంటి భద్రత లభిస్తోందో అర్థమవుతోందన్నారు. ఒక సమయంలో మంత్రి రోజా తనకు గాజులు, చీర పంపిస్తాన్నారని, కొడాలి నాని తన తల్లిని అవమానపరిచారని, జగన్ పాలనలో వారి మంత్రులు మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

దీనిని మార్చాలంటే విద్యా విధానంలో మార్పులు రావాలని లోకేశ్ చెప్పారు. మహిళలపై గౌరవం పెరిగేలా కేజీ నుంచి పాఠ్యాంశాలలో సమూలా మార్పులు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి 1, 2వ వార్డులలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. 2014లో ఎన్డీయేతో కలసి పనిచేశామని, ఆ సమయంలో ముస్లింలకు అండగా ఉన్నామని, ఈ సారి అంతకంటే ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోరి రాగానే ఇంటి, చెత్త పన్నులు తగ్గిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని హామీ ఇచ్చారు.

సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎం జాబితాలో జగన్ ఫస్ట్​ : లోకేశ్ - Nara Lokesh Fire on CM Jagan

Nara Lokesh Tweet on Sand Liquor Mafia: రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా నిత్యం మనుషులను చంపేస్తోందని లోకేశ్ ధ్వజమెత్తారు. తమ భర్త ఇంటికి తిరిగి రాలేడనే భయం మహిళలను వెంటాడుతోందన్నారు. ఇసుక మాఫియాకు బలైన మరో ప్రాణం బాపట్లలో బయటపడిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మరో కుటుంబాన్ని నాశనం చేసిందని లోకేశ్ దుయ్యబట్టారు. బాపట్లలోని ఇసుక ప్రాంతంలో బయటపడ్డ మృతదేహానికి ఇసుక మాఫియా కారణమనే తెలుస్తోందని ఆరోపించారు. ఈ ఆందోళనకర పరిస్థితులు రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితిని ప్రశ్నిస్తున్నాయని లోకేశ్ అన్నారు.

టీడీపీకి ఇచ్చే ప్రతి విరాళం మెరుగైన ఏపీ దిశగా చేస్తున్న ఉద్యమానికి శక్తినిస్తుంది: లోకేశ్ - Nara Lokesh on TDP Funds

ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్యావిధానంలో సమూల మార్పులు తెస్తాం: లోకేశ్
Last Updated :Apr 13, 2024, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.