ETV Bharat / state

తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - Nijam Gelavali Yatra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 12:56 PM IST

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చివరి దశకు చేరుకుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, మృతి చెందినట్లు పార్టీ వర్గాలు నిర్ధారించాయి. గతేడాది అక్టోబర్ 25న చిత్తూరులో ప్రారంభమైన నిజం గెలవాలి కార్యక్రమం ఈనెల 13న కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో ముగియనుంది.

nijam_gelavali_yatra
nijam_gelavali_yatra

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు నిర్ధారించాయి. నిజం గెలవాలి పర్యటన ప్రారంభం నుండి ఇప్పటిదాకా 194 కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఈ నెల 11, 12, 13వ తేదీలలో పరామర్శించే కుటుంబాలను కలుపుకుని మొత్తం 203 కుటుంబాలకు పరామర్శ పూర్తవనుంది. పరామర్శతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి 3 లక్షల చొప్పున భువనేశ్వరి ఆర్థికసాయం అందించారు. ఇప్పటి దాకా 25 పార్లమెంట్​ల పరిధిలో 92 నియోజకవర్గాల్లో 8,478కి.మీ ప్రయాణించారు.

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం - నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - Bhuvaneswari Nijam Gelavali Yatra

నేటి నుండి జరిగే మూడు రోజుల పర్యటనలో మరో 2 నియోజకవర్గాల్లో పర్యటించే వాటితో కలిపి మొత్తం 94 నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన పూర్తవనుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైన నిజం కార్యక్రమం ఈ నెల 13న కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో ముగియనుంది. నేటి నుండి గుంటూరు, నరసారావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి మలి విడత కార్యక్రమం సాగనుంది. నేడు తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో, 12న వినుకొండ, తిరువూరు నియోజకవర్గంలో, 13న తిరువూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించనున్నారు.

రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి : నారా భువనేశ్వరి - NIJAM GELAVALI YATRA IN Nandyala

అక్టోబర్‌లో ప్రారంభమైన యాత్ర : చంద్రబాబు అక్రమ అరెస్ట్​తో ఆవేదనకు గురై మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో గతేడాది అక్టోబర్‌ నెలలో చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు విడుదలయిన తరువాత భువనేశ్వరి యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తాజాగా మళ్లీ 'నిజం గెలవాలి' పేరుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తూ, వారికి తాము ఉన్నామనే ధైర్యం ఇస్తున్నారు.

చంద్రబాబు హయాంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు- జగన్​ పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు: భువనేశ్వరి - Nara Bhuvaneswari Nijam Gelavali

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.