ETV Bharat / state

నాటిన మొక్కలెన్ని, చేసిన ఖర్చు ఎంత - 'తెలంగాణకు హరితహారం' లెక్కలు తేల్చే పనిలో సర్కార్?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 10:29 AM IST

Haritha Haram Programme in Telangana : గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరిత హారం కార్యక్రమంపై కాంగ్రెస్​ సర్కార్​ ఫోకస్​ పెట్టింది. ఈ పథకంలో నాటిన మొక్కలు, ఖర్చు, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేయాలని భావిస్తోంది. దీంతో పాటు పథకం అమలు తీరుపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Government Focuse on Haritha Haram
Haritha Haram Programme in Telangana

Haritha Haram Programme in Telangana : గత ప్రభుత్వం చేసిన నిధుల దుర్వినియోగాన్ని కాంగ్రెస్​ సర్కార్​ వెలికితీసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని అంశాల్లో కమిటీ వేసి విచారణ జరిపిస్తోంది. మరికొన్ని వాటిపై ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన హరిత హారం పథకంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు కమిటీ వేయాలని భావిస్తోంది. అంతకుముందే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల గ్రామాలు, ప్రాతినిథ్యం వహించినన నియోజకవర్గాల్లో పథకం అమలు తీరుపై అధ్యయనం చేయాలని సర్కార్​ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం

Government Focuse on Haritha Haram : ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో 2015-16 నుంచి తొమ్మిది విడతలుగా చేపట్టిన 'తెలంగాణకు హరితహారం' పథకంపై చర్చ జరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ పథకం(Haritha Haram) కింద ఇప్పటి వరకు 292 కోట్ల మొక్కలు నాటినట్లు, రూ.11,747 కోట్ల ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్న నేపథ్యంలో వ్యయానికి అనుగుణంగా ఫలితాలు రాలేదనే అనుమానాలను సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హరితహారం పథకంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు వారిరువురూ అభిప్రాయపడినట్టు తెలిసింది.

Telangana Haritha Utsavam 2023 : 'పుడమి పులకరించింది.. ప్రకృతి పరవశించింది'

నాటిన మొక్కలకు రెండింతలు రికార్డుల్లో నమోదు చేయడం, ఆ తర్వాత ఆ మొక్కలు చనిపోయాయని పేర్కొంటూ మళ్లీ మొక్కలు నాటినట్లు చూపడం వంటివి జరిగాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా నిధుల దుర్వినియోగంపై కమిటీ వేద్దామని ఆమె ఈ సందర్భంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి సీఎం స్పందించి వందల కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలున్నాయని, ఆ స్థాయిలో పచ్చదనం పెరగలేదని అన్నారు.

Telangana Harithosthavam 2023 : 'ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలో సాగుతున్న తెలంగాణ హరితహారం'

Committee on Haritha Haram Funds : కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీశ్​రావులాంటి కీలక నేతల నియోజకవర్గాలు, వాటి పరిధిలోని గ్రామాలలో నర్సరీలు నెలకొల్పేందుకు చేసిన ఖర్చు, నాటిన మొక్కలు, ప్రస్తుత పరిస్థితిపై వాస్తవాలు తేల్చాలని ఆదేశించారు. ఆయా పంచాయతీల పరిధిలో నాటిన మొక్కలెన్ని, ప్రస్తుతం ఉన్నవి ఎన్ని అనేది తెలియాలని అన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని తన కార్యదర్సిని ఆదేశించారు. ప్రస్తుతానికి హరిత హారం పథకం విషయంలో కమిటీ వేసేందుకు నిర్ణయం తీసుకోలేదని, ప్రాథమికంగా కొన్ని గ్రామాల్లో అధ్యయనం చేసి, అందులో తేలిన అంశాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిపై కమిటీ వేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Ministers One Crore Plants Planted In Haritha Haram : కోటి మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం ప్రారంభించిన మంత్రులు

Haritha Haram Programme in Telangana : గత ప్రభుత్వం చేసిన నిధుల దుర్వినియోగాన్ని కాంగ్రెస్​ సర్కార్​ వెలికితీసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని అంశాల్లో కమిటీ వేసి విచారణ జరిపిస్తోంది. మరికొన్ని వాటిపై ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన హరిత హారం పథకంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు కమిటీ వేయాలని భావిస్తోంది. అంతకుముందే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల గ్రామాలు, ప్రాతినిథ్యం వహించినన నియోజకవర్గాల్లో పథకం అమలు తీరుపై అధ్యయనం చేయాలని సర్కార్​ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం

Government Focuse on Haritha Haram : ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో 2015-16 నుంచి తొమ్మిది విడతలుగా చేపట్టిన 'తెలంగాణకు హరితహారం' పథకంపై చర్చ జరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ పథకం(Haritha Haram) కింద ఇప్పటి వరకు 292 కోట్ల మొక్కలు నాటినట్లు, రూ.11,747 కోట్ల ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్న నేపథ్యంలో వ్యయానికి అనుగుణంగా ఫలితాలు రాలేదనే అనుమానాలను సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హరితహారం పథకంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు వారిరువురూ అభిప్రాయపడినట్టు తెలిసింది.

Telangana Haritha Utsavam 2023 : 'పుడమి పులకరించింది.. ప్రకృతి పరవశించింది'

నాటిన మొక్కలకు రెండింతలు రికార్డుల్లో నమోదు చేయడం, ఆ తర్వాత ఆ మొక్కలు చనిపోయాయని పేర్కొంటూ మళ్లీ మొక్కలు నాటినట్లు చూపడం వంటివి జరిగాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా నిధుల దుర్వినియోగంపై కమిటీ వేద్దామని ఆమె ఈ సందర్భంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి సీఎం స్పందించి వందల కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలున్నాయని, ఆ స్థాయిలో పచ్చదనం పెరగలేదని అన్నారు.

Telangana Harithosthavam 2023 : 'ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలో సాగుతున్న తెలంగాణ హరితహారం'

Committee on Haritha Haram Funds : కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీశ్​రావులాంటి కీలక నేతల నియోజకవర్గాలు, వాటి పరిధిలోని గ్రామాలలో నర్సరీలు నెలకొల్పేందుకు చేసిన ఖర్చు, నాటిన మొక్కలు, ప్రస్తుత పరిస్థితిపై వాస్తవాలు తేల్చాలని ఆదేశించారు. ఆయా పంచాయతీల పరిధిలో నాటిన మొక్కలెన్ని, ప్రస్తుతం ఉన్నవి ఎన్ని అనేది తెలియాలని అన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని తన కార్యదర్సిని ఆదేశించారు. ప్రస్తుతానికి హరిత హారం పథకం విషయంలో కమిటీ వేసేందుకు నిర్ణయం తీసుకోలేదని, ప్రాథమికంగా కొన్ని గ్రామాల్లో అధ్యయనం చేసి, అందులో తేలిన అంశాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిపై కమిటీ వేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Ministers One Crore Plants Planted In Haritha Haram : కోటి మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం ప్రారంభించిన మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.