ETV Bharat / state

అదే మొండి వైఖరి - ఇంటికెళ్లిన సచివాలయ సిబ్బంది పింఛన్‌ ఇవ్వలేరా ? - Pension Distribution issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 7:05 AM IST

Updated : May 1, 2024, 7:59 AM IST

Pension Distribution Issue In Andhra Pradesh
Pension Distribution Issue In Andhra Pradesh

Pension Distribution Issue In Andhra Pradesh: గుంటూరు జిల్లాలోని ఓ మండంలో 3 గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను అధికార సిబ్బంది చుట్టివచ్చారు. అలా వెళ్లినవారే పింఛనునూ అందించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే విధంగా అభాగ్యులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా తక్కువ వ్యవధిలో ఇంటివద్దే అందించవచ్చు. ఈ చిన్న విషయం 40 ఏళ్ల సర్వీసున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎం జగన్‌ తెలియనట్లు వ్యవహరించడం సిగ్గు చేటు అన్న వాదన వినిపిస్తోంది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ అసలు ఉద్దేశంలా కనిపిస్తోంది.

పింఛన్ల పంపిణీపై మొండివైఖరి - ఇంటికెళ్లిన సచివాలయ సిబ్బంది పింఛన్‌ ఇవ్వలేరా ?

Pension Distribution Issue In Andhra Pradesh : గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో ఒక్కో ఉద్యోగికి సగటున 74 మంది పింఛనుదారులు వచ్చారు. నగదు జమ గురించి భరోసానిచ్చిన వారికి డబ్బులు అందజేయడానికి మరో గంట, రెండు గంటల సమయం పట్టవచ్చు. లేదా రెండు రోజుల్లోనైనా పూర్తి చేస్తారు. పింఛనుదారుల వేలిముద్ర తీసుకుని పింఛను ఇవ్వడానికే అదనపు సమయం పడుతుంది. ఈ విషయాన్నే నెల రోజులుగా విపక్షాలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా మండుటెండల్లో వృద్ధులను బయటకు రప్పించే రాక్షస క్రీడను కొనసాగిస్తూనే ఉంది.

గత నెల 1న పింఛను పంపిణీకి ముందు సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో మెజారిటీ కలెక్టర్లు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్లు ఇవ్వవచ్చని ముక్తకంఠంతో చెప్పారు. ఈ సూచనను పెడచెవిన పెట్టి వైఎస్సార్సీపీకి వంతపాడేలా పింఛనుదారులను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించారు. ఇప్పుడు దానికి మించి బ్యాంకుల వద్దకు రప్పించేలా దారుణమైన ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లా అధికారుల ప్రయత్నంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఎంత సులువో ప్రస్తుతం నిరూపితమైంది. బ్యాంకుల్లో నగదు జమ కారణంగా ఎలాంటి ఆందోళనకు గురికావొద్దంటూ ఇళ్లకు వెళ్లి చెప్పాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిబ్బంది సమాచారమిచ్చారని కాకుమాను ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు.

పింఛన్లపై వైసీపీ సర్కార్​ మరో కుట్ర - లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యం - PENSION DISTRIBUTION ISSUE IN AP

రాష్ట్రంలో 65.49 లక్షల మంది పింఛనుదారులుంటే 48.92 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మిగిలిన 16.57 లక్షల మంది ఇళ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వాలి. సచివాలయాలవారీగా ఈ జాబితాలను ఇప్పటికే పంపారు. దాదాపు ప్రతి సచివాలయం పరిధిలోనూ ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సిన పింఛన్లు ఉన్నాయి. వీటిని అక్కడున్న పది మంది ఉద్యోగులు పంచుకుని ఇళ్ల వద్దకెళ్లాలని నిర్దేశించారు. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేసేవారికి ఇళ్లకు అటుఇటుగానే బ్యాంకుల్లో నగదు జమయ్యే పింఛనుదారులు ఉంటారు. అంత దూరం వెళ్లిన వారికి పక్కనుండే ఇతర పింఛనుదారులకు నగదు ఇవ్వడం కష్టమేమీ కాదు. ఎలాగూ సచివాలయ సిబ్బందిని ఇళ్ల వద్దకు పంపుతున్నారు. వారితోనే అందరికీ ఇప్పించవచ్చు.

ఇంటింటికీ వెళ్లి పింఛన్​ ఇవ్వాలి- కుట్రలు, కుతంత్రాల్లో అధికారుల భాగస్వామ్యం దురదృష్టకరం: చంద్రబాబు - pension distribution

ఏ అధికారి అయినా ప్రజలకు సమస్య వస్తే సులభ పరిష్కార మార్గం అనుసరిస్తారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి మాత్రం వైఎస్సార్సీపీకి వంతపాడేలా పింఛను పంపిణీని ఎంత సమస్యాత్మకంగా మార్చవచ్చో అంతా చేస్తున్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ఒకవేళ సరిపడా సచివాలయ సిబ్బంది లేరని క్షణం అనుకున్నా ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులున్నాయి. ఒకప్పుడు వీటి ద్వారానే ఇంటింటికీ అందించేవారు. ఈ విషయం సీఎస్‌కు తెలుసు కదా? పింఛనుదారుల పేరుపై మనియార్డర్‌ తీసి నేరుగా ఇళ్లకే నగదు అందించవచ్చు కదా? ఇబ్బంది పెట్టవద్దంటే ఇలాంటి మరెన్నో మార్గాలూ కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

వైఎస్సార్సీపీకి వంత పాడేలా జవహర్‌రెడ్డి జగన్నాటకం - బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం - CS Jawahar Reddy Plan on Pensions

Last Updated :May 1, 2024, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.