ETV Bharat / state

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 2:59 PM IST

Updated : Mar 15, 2024, 4:07 PM IST

Kavitha
Kavitha

ED Raids at MLC Kavitha's House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. తనిఖీల నేపథ్యంలో ఆమె నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు.

ED Raids at MLC Kavitha's House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆమె ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ గతంలో జారీ చేసిన నోటీసులను సవాల్​ చేస్తూ​ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో కోరారు. ఈ పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు విచారించింది. నేడూ విచారణకు రాగా, ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇంతలోనే ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేయడం గమనార్హం.

'కేసు కోర్టులో ఉన్నా పదేపదే సమన్లా?'- ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడోసారి దూరం

Last Updated :Mar 15, 2024, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.