ETV Bharat / sports

మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్‌ - తల్లి కోసం చెన్నైకి పయనం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 6:39 AM IST

Ashwin England Series : టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్​ ఇంగ్లాండ్ సిరీస్​ నుంచి వైదొలగాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా అతడు శుక్రవారం చెన్నైకి పయనమయ్యాడు.

Etv Bharat
Etv Bharat

Ashwin England Series : రాజ్​కోఠ్​ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ నుంచి టీమ్ఇండియా స్టార్ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల అతడు శుక్రవారం మ్యాచ్​ ముగిసిన తర్వాత చెన్నైకి పయనమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్టులో పేర్కొన్నారు. అశ్విన్ తల్లి తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో మీడియా, అభిమానులు అశ్విన్​తో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని బీసీసీఐ బోర్డు పేర్కొంది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని బీసీసీఐ తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్‌ఇండియా జట్టు అందిస్తుందంటూ పేర్కొంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - మూడో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్​ను నమోదు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో లక్ష్య చేధన కోసం రెండో రోజు బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌(133*) సెంచరీ బాదాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్​ సిరాజ్‌, రవిచంద్రన్​ అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు.

ఇదే వేదికగా అశ్విన్‌ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డు వేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఒక వికెట్‌ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అలా భారత్‌ టెస్టు క్రికెట్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్న సాధించిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్‌ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

మరోవైపు రానున్న మ్యాచ్​లో బౌలర్లు వేగం పుంజుకొని ప్రత్యర్థి జట్టును ఎంత తొందరగా ఆలౌట్‌ చేస్తేనే అంత మేలు అంటూ క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో మ్యాచ్​లకు అశ్విన్‌ దూరం కావడం అనేది జట్టుకు పెద్దదెబ్బే. ప్రస్తుతం జట్టులో పూర్తిస్థాయి బౌలర్లు నలుగురే ఉన్నారు. దీంతో వీరిపైనే భారం పడనుంది.

ఈ ఘనత ఆయనకే అంకితం- అశ్విన్ ఎమోషనల్- మోదీ స్పెషల్ ట్వీట్

వికెట్ నెం.500- టెస్టుల్లో 'అశ్విన్' ఘనమైన రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.