ETV Bharat / politics

'ఈ ఎన్నికలు భవిష్యత్​కు బాటలు' - వైఎస్సార్సీపీ నేతల దాడులపై చంద్రబాబు ఫైర్​ - AP ELECTIONS 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 10:00 AM IST

Chandrababu Fire on YSRCP Attacks : ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్​కు బాటలు వేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

chandrababu_family_caste_vote
chandrababu_family_caste_vote (Etv Bharat)

Chandrababu Fire on YSRCP Attacks : ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలన్నారు.

ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరచిపోలేనిదని అన్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారని, ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ ఎన్నికలే అని జనం గుర్తించారని తెలిపారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భావితరాలకు, భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని, విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని, అశ్రద్ధ చేయకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు - పోలింగ్‌ ఏజెంట్లు కిడ్నాప్ - ఎక్కడికక్కడ దాడులు - clashes in ap elections

పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని కోరారు.

ఓటింగ్ లో స్త్రీ శక్తి సత్తా చాటాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గతానికి భిన్నంగా ఈసారి ఓటింగ్ సరళిలో మార్పు కనిపిస్తోందని భువనేశ్వరి తెలిపారు.

జోరుగా పోలింగ్​- ఓటేసేందుకు సాయంత్రం 6గంటల వరకు ఛాన్స్ - Polling in AP

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ- ఓటుహక్కును వినియోగించుకున్న ప్రముఖులు - Political Leaders Cast Their Vote

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.