ETV Bharat / politics

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే నీటి ప్రాజెక్టులు అప్పగించారు : హరీశ్‌రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 4:35 PM IST

Harish Rao about KRMB Project in Assembly : గడిచిన పదేళ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. ఇవాళ శాసన సభలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానంపై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరిగింది.

Harish Rao about KCR in Assembly
Harish Rao about KRMB Project in Assembly

Harish Rao about KRMB Project in Assembly : పదేళ్లలో బీఆర్​ఎస్​ ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింత కుదరదని కేసీఆర్‌ రెండో అపెక్స్‌ భేటీలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 13న తాము నల్గొండలో సభ పెట్టినందువల్లే అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులపై తీర్మానం పెట్టారని వాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారు : హరీశ్‌రావు

బీఆర్​ఎస్​పై బురద జల్లేందుకు ఉత్తమ్‌కుమార్​ రెడ్డి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కోసం పేగులు తెగేదాక కొట్లాడింది బీఆర్​ఎస్సేనని, కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఒక నెలలోనే కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రానికి లేఖ పెట్టామని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం అయినా కేంద్రం స్పందించకుంటే తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రానికి 35 నుంచి 40 లేఖలు రాశామని తెలిపారు.

బీఆర్​ఎస్​(BRS) పోరాటం వల్లే కృష్ణా జలాల పంపిణీకి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రాణాలు పోయినా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయరని ఉద్ఘాటించారు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకెళ్లేందుకు ఏపీకి అనుమతించారని అన్నారు. తమ నేత సోనియా గాంధీని దేవత అన్నారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆమెను బలిదేవత అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌ తెలంగాణను బ్రహ్మాండంగా పాలించారని చెప్పారు. ఇది గాంధీభవన్‌ కాదు, శాసనసభ అని అధికార నాయకులను ఉద్దేశించి హరీశ్‌రావు మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ ప్రాజెక్టుపై స్మితా సభర్వాల్‌ తరహాలోనే రాహుల్‌ బొజ్జా కూడా లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు.

Harish Rao about KCR in Assembly : కేసీఆర్‌ గురించి కొందరు వ్యక్తిగతంగా తూలనాడుతున్నారని, ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ లేకుంటే, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడే కాదని వాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలకులు అధికారులపైకి తమ తప్పులు నెడుతున్నారని ఆరోపించారు. తీర్మానంలోని డిమాండ్లకు తాము మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. తీర్మానంలో పెట్టినవి తాము గతంలో పెట్టిన డిమాండ్లేనని చెప్పారు. కృష్ణా జలాల్లో సగం వాటా కోసం తాము గతంలో ఎన్నో లేఖలు రాశామని గుర్తు చేశారు.

299 టీఎంసీల వాటాకు ఆద్యులే గత కాంగ్రెస్‌ పాలకులని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఓడలు బండ్లు అవుతాయని, బండ్లు ఓడలు అవుతాయని కాంగ్రెస్​ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నెల రోజుల్లో ప్రాజెక్టులు అప్పగిస్తామని జనవరి 17 నాటి భేటీలో ప్రభుత్వం తెలిపిందని ఆరోపించారు. దీని వల్ల తెలంగాణ ఇంజినీర్లు డ్యామ్‌లపైకి వెళ్లాలంటే కేఆర్‌ఎంబీ అనుమతి కావాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 18న అన్నీ పత్రికల్లో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, జనవరి 19న తానే ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించానని వివరించారు.

జనవరి 17న జరిగిన మినిట్స్‌ భేటీ అంశాలు మరునాడే బయటకు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్​రావు చెప్పారు. మినిట్స్‌లో తప్పు ఉందని జనవరి 27న మంత్రి కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. మరి అదే మంత్రి పది రోజులపాటు ఏం చేశారని, ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఫిబ్రవరి 1 నాటి రెండో మీటింగ్‌లోనూ ప్రాజెక్టులు అప్పగిస్తామని ప్రభుత్వం తెలిపిందని ఆరోపించారు. నీటి వాటాల పంపకాలపై కేంద్రానికి 27 లేఖలు రాశామని హరీశ్​రావు తెలిపారు. నీటి వాటాల్లో 50:50 కావాలని కేంద్రానికి లేఖ రాశామని, తామపై బురదజల్లేందుకు కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​

'కృష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు' - అసెంబ్లీలో ప్రభుత్వం నోట్

Harish Rao about KRMB Project in Assembly : పదేళ్లలో బీఆర్​ఎస్​ ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింత కుదరదని కేసీఆర్‌ రెండో అపెక్స్‌ భేటీలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 13న తాము నల్గొండలో సభ పెట్టినందువల్లే అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులపై తీర్మానం పెట్టారని వాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారు : హరీశ్‌రావు

బీఆర్​ఎస్​పై బురద జల్లేందుకు ఉత్తమ్‌కుమార్​ రెడ్డి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కోసం పేగులు తెగేదాక కొట్లాడింది బీఆర్​ఎస్సేనని, కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఒక నెలలోనే కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రానికి లేఖ పెట్టామని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం అయినా కేంద్రం స్పందించకుంటే తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రానికి 35 నుంచి 40 లేఖలు రాశామని తెలిపారు.

బీఆర్​ఎస్​(BRS) పోరాటం వల్లే కృష్ణా జలాల పంపిణీకి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రాణాలు పోయినా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయరని ఉద్ఘాటించారు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకెళ్లేందుకు ఏపీకి అనుమతించారని అన్నారు. తమ నేత సోనియా గాంధీని దేవత అన్నారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆమెను బలిదేవత అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌ తెలంగాణను బ్రహ్మాండంగా పాలించారని చెప్పారు. ఇది గాంధీభవన్‌ కాదు, శాసనసభ అని అధికార నాయకులను ఉద్దేశించి హరీశ్‌రావు మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ ప్రాజెక్టుపై స్మితా సభర్వాల్‌ తరహాలోనే రాహుల్‌ బొజ్జా కూడా లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు.

Harish Rao about KCR in Assembly : కేసీఆర్‌ గురించి కొందరు వ్యక్తిగతంగా తూలనాడుతున్నారని, ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ లేకుంటే, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడే కాదని వాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలకులు అధికారులపైకి తమ తప్పులు నెడుతున్నారని ఆరోపించారు. తీర్మానంలోని డిమాండ్లకు తాము మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. తీర్మానంలో పెట్టినవి తాము గతంలో పెట్టిన డిమాండ్లేనని చెప్పారు. కృష్ణా జలాల్లో సగం వాటా కోసం తాము గతంలో ఎన్నో లేఖలు రాశామని గుర్తు చేశారు.

299 టీఎంసీల వాటాకు ఆద్యులే గత కాంగ్రెస్‌ పాలకులని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఓడలు బండ్లు అవుతాయని, బండ్లు ఓడలు అవుతాయని కాంగ్రెస్​ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నెల రోజుల్లో ప్రాజెక్టులు అప్పగిస్తామని జనవరి 17 నాటి భేటీలో ప్రభుత్వం తెలిపిందని ఆరోపించారు. దీని వల్ల తెలంగాణ ఇంజినీర్లు డ్యామ్‌లపైకి వెళ్లాలంటే కేఆర్‌ఎంబీ అనుమతి కావాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 18న అన్నీ పత్రికల్లో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, జనవరి 19న తానే ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించానని వివరించారు.

జనవరి 17న జరిగిన మినిట్స్‌ భేటీ అంశాలు మరునాడే బయటకు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్​రావు చెప్పారు. మినిట్స్‌లో తప్పు ఉందని జనవరి 27న మంత్రి కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. మరి అదే మంత్రి పది రోజులపాటు ఏం చేశారని, ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఫిబ్రవరి 1 నాటి రెండో మీటింగ్‌లోనూ ప్రాజెక్టులు అప్పగిస్తామని ప్రభుత్వం తెలిపిందని ఆరోపించారు. నీటి వాటాల పంపకాలపై కేంద్రానికి 27 లేఖలు రాశామని హరీశ్​రావు తెలిపారు. నీటి వాటాల్లో 50:50 కావాలని కేంద్రానికి లేఖ రాశామని, తామపై బురదజల్లేందుకు కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​

'కృష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు' - అసెంబ్లీలో ప్రభుత్వం నోట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.