ETV Bharat / politics

'ఈ ఎన్నికలు - గుజరాత్​ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న యుద్ధం' - CM Revanth MP Election Camapaign

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 6:53 PM IST

Updated : Apr 30, 2024, 7:36 PM IST

CM Revanth Reddy MP Election Camapaign at Bhupalpalli : రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు గుజరాత్​ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతుందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన కాంగ్రెస్​ జనజాతర సభలో పాల్గొన్న సీఎం, అనంతరం ప్రసంగించారు.

CM Revanth Reddy MP Election Camapaign
CM Revanth Reddy MP Election Camapaign at Bhupalpalli

CM Revanth Reddy MP Election Camapaign : రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతుందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. అమిత్​ షాను కేసీఆర్​ ఆవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని భూపాలపల్లిలో జరిగిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వరంగల్​కు ఔటర్​ రింగ్​ రోడ్డు, ఎయిర్​పోర్టు రాకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతుందని ఆరోపించారు. గాంధీభవన్​కు దిల్లీ పోలీసులను పంపించారని తెలిపారు. తనను అరెస్టు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించారన్నారు.

గుజరాత్​ పెత్తనమా లేక తెలంగాణ పౌరుషమా : గుజరాత్​ పెత్తనమా లేక తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామంటూ సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. దిల్లీ పోలీసులను కాదు, సరిహద్దు సైనికులను తెచ్చుకున్నా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఎన్నికలు గుజరాత్​ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీతో మాజీ సీఎం కేసీఆర్​ చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శలు చేశారు. ఎన్నికలయ్యాక బీజేపీతో కేసీఆర్​ పొత్తు పెట్టుకోబోతున్నారని చెప్పారు. బీఆర్​ఎస్​కు ఒక్క ఓటు వేసినా అది వృథానేనని అన్నారు. కారు కార్ఖానాకు పోయింది, జబారులో తూకానికి అమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో బీఆర్​ఎస్​ను చేర్చుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.

"ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ఈ కుట్రలను భగ్నం చేసేందుకు తాను ఉన్నాను. గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాడుతాను. అమిత్​ షాను కేసీఆర్​ ఆవహించినట్లు ఉన్నారు. దిల్లీలో తన మీద కేసు పెట్టి గాంధీభవన్​కు వారిని పంపించారు. నన్ను అరెస్టు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించారు. గుజరాత్​ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం. దిల్లీ పోలీసులను కాదు, సరిహద్దు సైనికులను తెచ్చుకున్నా భయపడను. ఈ ఎన్నికలు గుజరాత్​ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటే. బీఆర్​ఎస్​తో కేసీఆర్​ చీకటి ఒప్పందం జరిగింది. కారు కార్ఖానాకు పోయింది. బజార్​లో తూకానికి అమ్మాల్సిందే." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

'ఈ ఎన్నికలు - గుజరాత్​ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న యుద్ధం

సెమీ ఫైనల్స్​లో కేసీఆర్​ను ఓడించారు - ఫైనల్స్​లో మోదీని ఓడించాల్సిన బాధ్యత మీదే : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Election Campaign

వచ్చే 11 రోజులు చాలా ముఖ్యం - రైతు రుణమాఫీ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలి : మంత్రులకు సీఎం ఆదేశం - CM REVANTH ON RYTHU RUNA MAFI

Last Updated : Apr 30, 2024, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.