ETV Bharat / politics

కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం - వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 7:20 PM IST

CHANDRABABU_PRAJA_GALAM_MEETING
CHANDRABABU_PRAJA_GALAM_MEETING

CHANDRABABU PRAJA GALAM MEETING: జగన్‌ చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన లేదని, వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పులకుప్పగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మార్చే కీలక తరుణమిదని, వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం అని అన్నారు.

కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం - వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: చంద్రబాబు

CHANDRABABU PRAJA GALAM MEETING: సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీది అని, ఒక ఎంపీటీసీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టామని, ప్రజలంతా గెలిపించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మార్చే కీలక తరుణమిదన్న చంద్రబాబు, టీడీపీ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి అని, వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అన్న చంద్రబాబు, కేంద్ర సహకారం కూడా రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పులకుప్పగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తెచ్చారా, ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయా, ఆదాయం పెరిగిందా, రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా అని నిలదీశారు.

నవరత్నాలు కాదు - నకిలీ రత్నాలు : చంద్రబాబు - Chandrababu criticized YCP MLAs

వైసీపీ హయాంలో విద్యపై పెట్టిన ఖర్చు ఎంత అని, వచ్చిన ఫలితాలేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు దోచింది ఎంత? దాచుకుంది ఎంతో చెప్పాలని నిలదీశారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ఆరోగ్యాలతో ఆడుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత ధనికుడు జగన్‌ అని, ఇష్టానుసారం భూములు దోచుకున్నారని విమర్శించారు. జగన్‌ చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉందా అని ప్రశ్నించారు.

వైసీపీ హయంలో దోపిడీ చేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని, టీడీపీ హయాంలో సీమలో 90 శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇచ్చామని గుర్తు చేశారు. అనంతపురంలో కియా మోటార్స్‌ తీసుకువచ్చామన్న చంద్రబాబు, కడప విమానాశ్రయాన్ని తామే అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మద్యపాన నిషేధం పేరుతో ప్రజలను జగన్ మోసగించారని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారని ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హామీ ఏమైందని, మాట తప్పిన జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా అని అన్నారు.

జగన్ చేసేవి శవ రాజకీయాలు - నావి ప్రజా రాజకీయాలు: చంద్రబాబు - Bapatla Prajagalam Sabha

మాదాసి కురబలను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సి ఉందన్న చంద్రబాబు, పేదలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని తెలిపారు. కూటమి వచ్చాక సర్పంచులకు నిధులు, విధులు ఇస్తామని, స్థానిక సంస్థలు, సర్పంచులదే పెత్తనం ఉంటుందని భరోసానిచ్చారు. జగన్‌ శవరాజకీయాలు చేస్తున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం అని పేర్కొన్నారు. సంపద సృష్టించి, ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

సీఎం పదవి నాకు బాధ్యత- జగన్‌కు వ్యాపారం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.