ETV Bharat / politics

టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు - ఐదు అసెంబ్లీ స్థానాల్లో మార్పు - B FORMS TO TDP CANDIDATES

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 8:47 AM IST

Updated : Apr 21, 2024, 5:06 PM IST

Chandrababu To Give B Forms To TDP Candidates : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత బీ-ఫారాలు అందించారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

b form to tdp candidates
b form to tdp candidates

Chandrababu To Give B Forms To TDP Candidates : సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే తెలుగుదేశం గెలుపు గుర్రాలకు బీఫారమ్‌ పంపిణీ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ఆల్‌ ది బెస్ట్‌ తమ్ముళ్లూ అంటూ అధినేత చంద్రబాబు అభ్యర్థులకు చంద్రబాబు తన చేతులమీదుగా బీఫారాలు అందచేశారు. బీఫారమ్‌ తీసుకున్న ప్రతిఒక్కరూ విజయబావుటా ఎగరవేయాలని స్ఫూర్తి నింపారు. ఇప్పటివరకూ ప్రకటించిన అభ్యర్థుల్లో మొత్తంగా 5గురిని మార్చి వేరొకబరిని సర్దుబాటు చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబునివాసంలో బీఫారమ్‌ల పంపిణీ ప్రక్రియ సందడి వాతావరణంలో సాగింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల్లో పలువురిని మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందించారు.

మెుత్తం ఐదు స్థానాల అభ్యర్థిత్వాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేటుచేసుకున్నాయి. ఉండి టిక్కెట్ రఘురామకృష్ణం రాజుకి కేటాయించారు. ఆ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షలుగా నియమించారు. నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతా రామలక్ష్మీని పొలిట్‌బ్యూరోలకి తీసుకోవడంతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమన్వకర్తగా నియమించారు. మాడుగుల టిక్కెట్ ను బండారు సత్యనారాయణ మూర్తి దక్కించుకోగా, పాడేరు టిక్కెట్ ను గిడ్డి ఈశ్వరికి అధిష్టానం కేటాయించింది. మడకశిర స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగనున్నారు. వెంకటగిరి స్థానాన్ని కుమార్తె నుంచి తండ్రి కురుగొండ రామకృష్ణకు మార్చారు.


అనపర్తి కూటమి అభ్యర్థిగా నల్లమిల్లిని కొనసాగించండి - నారా భువనేశ్వరికి మహిళల వినతి పత్రం - Nallamilli assembly seat issue

బీఫారమ్‌ల ప్రక్రియకు మొత్తంగా 13మంది అభ్యర్థులు వివిధ కారణాలవల్ల హాజరుకాలేకపోయారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌, రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు, నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవింద్‌బాబు, విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దెరామ్మోహన్‌, చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి, పలమనేరు అభ్యర్థి అమర్నాథ్‌రెడ్డి, బనగానపల్లె అభ్యర్థి బిసిజనార్థన్‌రెడ్డి, తాడిపత్రి అభ్యర్థి జె.సి.ప్రభాకర్‌రెడ్డి, రాప్తాడు అభ్యర్థి పరిటాల సునీత, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవీరెడ్డి లు వివిధ కారణాల చేత హాజరుకాలేకపోయారు.

కడప అభ్యర్థి మాధవీరెడ్డి బదులు ఆమె భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బదులు ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు బీఫారమ్స్‌ తీసుకున్నారు. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు పెండింగులో పెట్టారు. అనపర్తి వ్యవహరంపై స్పష్టత వచ్చాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు చంద్రబాబు బీ-ఫారాలు ఇవ్వనున్నారు. అనపర్తి తెలుగుదేశం టిక్కెట్ ఆశించిన నల్లమిల్లి రామకష్ణా రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


అనపర్తి బరిలో బీజేపీ - టీడీపీ నేత నల్లమిల్లి అనుచరుల ఆందోళన - POLITICAL TENSION IN ANAPARTHI

పార్లమెంట్‌ వారీగా పార్లమెంట్‌ అభ్యర్థితో కలిసి అసెంబ్లీ అభ్యర్థులు అధినేతతో బీఫారమ్స్‌ పట్టుకుని ఫోటోలు దిగారు. తొలిసారి బీఫారమ్‌ అందుకున్న అభ్యర్థులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచి తీరుతుందనే ధీమాను వారు వ్యక్తంచేశారు. అభ్యర్థులందరితోనూ కలిసి చంద్రబాబు తన నివాసంలో భోజనం చేశారు. ప్రతిఒక్కరికీ విజయ విజయం సాధించాలని శుభాకాంక్షలు చెబుతూ వారిలో స్ఫూర్తి నింపారు.

అభ్యర్థులందరితో ప్రతిజ్ఞ: ఉండవల్లిలోని తన నివాసంలో ఎన్టీఆర్‌ ప్రతిమకు పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు, అభ్యర్థులందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు, నిర్ణయాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, పార్టీకి విధేయతతో, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. తమకు జకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా నీతి, నిజాయితీతో, నిరాడంబరంగా ప్రజా సేవకు అంకితమౌతానని తేల్చిచెప్పారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో, కుల, మత వర్ణాలకు అతీతంగా సర్వవర్గ సంక్షేమానికి, ఆదర్శవంతమైన సమాజం కొరకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనారు.

నల్లమిల్లి ఇంటికి టీడీపీ నేతలు- తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ - tdp leaders visit nallamilli house

నేడు టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు - చంద్రబాబు నివాసానికి నేతలు
Last Updated : Apr 21, 2024, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.