ETV Bharat / politics

రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్​ నమోదు - గతంలో కంటే పెరిగిన ఓటింగ్​ - Poll Percentage in ap

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 2:45 PM IST

Updated : May 15, 2024, 9:03 AM IST

81.17 Poll Percentage in AP Elections 2024 : రాష్ట్రంలో పోలింగ్ శాతం లెక్క తేలింది. 2024 ఎన్నికలకు 81.76 శాతం మేర పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60 శాతం మేర పెరిగింది. ఇందులో 1.10 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఉందని ఈసీ వెల్లడించింది.

ceo_on_poll_percentage
ceo_on_poll_percentage (Etv Bharat)

81.76 Poll Percentage in AP Elections 2024 : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయి పోలింగ్ నమోదైంది. ఈవీఎంల్లో నమోదైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.76 శాతం మేర పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సరాసరిన 80.07 శాతం పోలింగ్ నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్‌ 1.10 శాతం మేర నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.09, పల్నాడు జిల్లాలో 85.65, బాపట్ల జిల్లాలో 84.98, కృష్ణా జిల్లాలో 84.05శాతం పోలింగ్‌ జరిగింది. కోనసీమ జిల్లాలో 83.91, అనకాపల్లి జిల్లాలో 83.84, ఏలూరు జిల్లాలో 83.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

శ్రీసత్యసాయి జిల్లాలో 82.77, పశ్చిమగోదావరి జిల్లాలో 82.70, చిత్తూరు జిల్లాలో 82.65 శాతం నమోదైనట్లు తెలిపింది. విజయనగరం జిల్లాలో 81.34, తూర్పుగోదావరి జిల్లాలో 80.94, నంద్యాల జిల్లాలో 80.92, కాకినాడ జిల్లాలో 80.31 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 79.68, వైఎస్సార్‌ 79.40, అనంతపురం జిల్లాలో 79.25, గుంటూరు జిల్లాలో 78.81, నెల్లూరు జిల్లాలో 78.10 శాతం పోలింగ్‌ జరిగింది.

మూడంచెల భద్రతతో స్ట్రాంగ్‌రూంల్లోకి ఈవీఎంలు - Security At EVMs In Strong Rooms

తిరుపతి జిల్లాలో 77.82, పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10, అన్నమయ్య జిల్లాలో 76.23, శ్రీకాకుళం జిల్లాలో 76.07, కర్నూలు జిల్లాలో 75.83, అల్లూరి జిల్లాలో 70.20, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60 శాతం మేర అదనంగా పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లకు గాను 3.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు స్పష్టవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91 శాతం మేర పోలింగ్ జరగ్గా, కనిష్టంగా తిరుపతిలో 59.95 శాతం నమోదైంది.

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్యాయత్నం! - Attack On Pulivarthi Nani

ఇప్పటికే ఈవీఎంలను స్ట్రాంగ్​రూమ్​లకు తరలించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్ట్రాంగ్​ రూమ్​ల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం జూన్​ 4న తెలియనుంది.

అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో ఉండి ఓటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయం: నిమ్మగడ్డ రమేష్​కుమార్​ - NIMMAGADDA RAMESHKUMAR ON VOTING

Last Updated :May 15, 2024, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.