ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani వైసీపీ కొత్త నినాదం "ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి".. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చుతోందా..!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 10:12 PM IST

Prathidhwani

Prathidhwani:"ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి" ఇదీ వైసీపీ కొత్త నినాదం.  వై నాట్ 175, జగనన్నే మా భవిష్యత్, నువ్వే మా నమ్మకం జగన్ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ అంటున్నారు.  ఇంతకు ముందుగా ఇలానే ఒకసారి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్.  గడపగడపకు ప్రభుత్వంలో వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయో మనం చూస్తునే ఉన్నాం. జగనే కావాలి అంటూ జనంలోకి వెళితే ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది? గత ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? అధికారం చేతికి వచ్చాకా ఏం చేశారు?  ఆంధ్రాకు జగనే కావాలని వైసీపీ నినాదం. అయితే.. ఇప్పటికే అధికారం ఉపయోగించి, నయానోభయానో తీసుకు వచ్చినా గానీ జనం జగన్ సభల నుంచి పారిపోతున్నారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక వైసీపీ సభల పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వ వైఫల్యాల నుంచి విజయవంతంగా ప్రజల దృష్టి, విపక్షాల దృష్టి మరల్చా అని ప్రభుత్వం అనుకుంటోందా? అది సాధ్యమేనా?  ఇలాంటి అంశాలపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details