కడప నగరంలో వేర్వేరు ప్రాంతాలలో ఇద్ధరు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కడప శ్రీ రామ్ నగర్కు చెందిన కార్తీక్ వ్యసనాలకు బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. ఫలితంగా మనస్తాపానికి గురైన కార్తీక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కిందపడి..
కడప రైల్వే స్టేషన్ పరిధిలోని కనుమలో పల్లి వద్ద గోస్వామి అనే రాజస్థాన్కు చెందిన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.