ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజంపేటలో ముగిసిన జాతీయ వాలీబాల్ పోటీలు

By

Published : Feb 1, 2020, 11:35 AM IST

కడప జిల్లా రాజంపేటలో గత ఆరు రోజులుగా జరిగిన జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. తుదిపోరులో ఉత్తరప్రదేశ్​, తమిళనాడు జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది.

National Volleyball Tournament Completed at Rajampet
రాజంపేటలో ముగిసిన జాతీయ వాలీబాల్ పోటీలు

రాజంపేటలో ముగిసిన జాతీయ వాలీబాల్ పోటీలు

కడప జిల్లా రాజంపేటలో గత ఆరు రోజులుగా జరిగిన జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. తుది పోరులో బాలుర విభాగంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు జట్ల మధ్య ఆసక్తిగా సాగిన పోటీలో ఉత్తరప్రదేశ్ జట్టు 13 - 15 తేడాతో ఛాంపియన్​గా నిలిచింది. బాలికల విభాగంలో కేరళపై పశ్చిమబంగాల్​ గెలుపొందింది. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది క్రీడాభిమానులు తరలివచ్చారు. గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి:

పులివెందులలో జాతీయస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details