ఆంధ్రప్రదేశ్

andhra pradesh

School Bus Accident: పాఠశాల బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

By

Published : Jan 9, 2022, 5:10 PM IST

School Bus Accident: పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులుండగా.. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణప్రాయం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాల బస్సు బోల్తా
పాఠశాల బస్సు బోల్తా

School Bus Accident:పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఘోర ప్రమాదం తప్పింది. ఆర్​అండ్​బీ రహదారిపై ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. వీరిని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాడేపల్లిగూడేనికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్​లో పదో తరగతి విద్యార్థులకు ఏ.కే.రత్నం పేరిట ఇవాళ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన అనంతరం ఓ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని బయల్దేరింది.

బాదంపూడి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని అధిగమించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి

FAMILY SUICIDE: నిజామాబాద్‌ వాసుల ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే ?

ABOUT THE AUTHOR

...view details