ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vice President Venkaiah Naidu: విశాఖ జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన

By

Published : Nov 22, 2021, 5:11 AM IST

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో ఉపరాష్ట్రపతికి అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్​లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

Vice President Venkaiah Naidu
Vice President Venkaiah Naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్​లతో ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్​లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం మీద ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా స్టేషన్​లలో అగునుంది. తిరిగి అరకు నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు విశాఖ చేరుతుంది.

గౌరవ వందనం స్వీకరిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details