ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT : జీపు బోల్తా...ఇద్దరు మృతి

By

Published : Jan 13, 2022, 7:03 PM IST

జీపు బోల్తా...ఇద్దరు మృతి
జీపు బోల్తా...ఇద్దరు మృతి

విశాఖపట్నం జిల్లా మన్యంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని కడుగుల నుంచి కొయ్యూరు మండలం చింతవానిపాలేనికి వెళ్తున్న జీపు.. బొంతువలస ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కొయ్యూరు మండలం చింతవానిపాలెం గ్రామానికి చెందిన దేవుడు, చిట్టిబాబు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో పది మంది ఉన్నారు.

ఇదీచదవండి. Illegal Affair Killed Son: ప్రేమ పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరికి అడ్డువచ్చిన వారిని..!

ABOUT THE AUTHOR

...view details