ప్రకాశం జిల్లా పర్చూరులోని చెంచుల కాలనీ వద్ద పోలీసులు దాడులు చేశారు. కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. ఈ దాడులు చేపట్టారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే 4 కోళ్లు... 48, 500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.