నెల్లూరు జిల్లా బంగారంపేట సమీపంలోని అటవీప్రాంతంలో.. కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పది మంది పందెం రాయుళ్లని అదుపులోకి తీసుకున్నట్లు పెళ్లకూరు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. 20 ద్విచక్రవాహనాలతో పాటు రూ. 4 వేల నగదు, ఐదు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి..పది మంది అరెస్టు
కోడి పందేలు నిర్వహిస్తున్న పది మందిని..నెల్లూరు జిల్లా పెళ్లకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారంపేట అటవీ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి.. రూ. 4 వేల నగదుతో పాటు ఐదు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
బంగారంపేటలో పందెంరాయుళ్లు అరెస్ట్