ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది

By

Published : Sep 21, 2020, 4:37 PM IST

నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయం నిండింది. అధికారులు జలాలను కిందికి వదలడంతో..పెన్నానదికి వరద పోటెత్తింది. పెన్నా పరవళ్లు చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు

heavy flood in penna river
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది


పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాలనుంచి భారీగా వరద నీరు చేరడంతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. లక్షా 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు పెన్నా నదికి వదిలారు. పెన్నా నదీ పరవళ్లు తొక్కుతుండటంతో నది ప్రవాహం చూసేందుకు జనాలు తరలి వస్తున్నారు. నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్​పై వాహనాల్లో వెళ్లేవారు.. పెన్నా నదిని చూస్తుండటంతో ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది
ఆదివారంతో పోలిస్తే వరద కాస్త తగ్గుముఖం పట్టినా..పెన్నా నది ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నెల్లూరు వారిధి వద్ద లక్షా నలభై వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరు తగ్గుముఖం పడుతోంది.

ABOUT THE AUTHOR

...view details