ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీజేఐ ఎన్వీ రమణ రాకతో కోలాహలంగా పొన్నవరం

By

Published : Aug 20, 2022, 6:06 PM IST

CJI NV Ramana భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన పొన్నవరంలో పర్యటించారు. సీజేఐ హోదాలో రెండోసారి గ్రామానికి వచ్చిన జస్టిస్ రమణకు వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీజేఐ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పొన్నవరంలో సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం
పొన్నవరంలో సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం

CJI NV Ramana Ponnavaram Tour సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆయన స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా పొన్నవరంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సమేతంగా గ్రామానికి చేరుకున్న సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. అక్కడినుంచి రామలింగేశ్వరస్వామి గుడికి వెళ్లిన సీజేఐ దంపతులు.. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత.. సొంత ఇంటికి వెళ్లారు. బంధువులు, గ్రామస్థులతో ఎన్వీ రమణ నివాసం కోలాహలంగా మారింది. కుటుంబ సభ్యులు, సమీప బంధువులతో ముచ్చటించిన సీజేఐ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గ్రామస్థులను పేరు పేరునా పలకరించారు. సీజేఐ హోదాలో జస్టిస్‌ ఎన్వీ రమణ రెండోసారి స్వగ్రామంలో పర్యటించారు. అనంతరం జస్టిస్​ ఎన్వీ రమణ హైదరాబాద్​కు బయల్దేరారు.

అంతకుముందు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. వర్సిటీలో జరిగిన 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్‌ రమణను గౌరవ డాక్టరేట్‌తో యూనివర్శిటీ సత్కరించింది. అనంతరం సీజేఐ విద్యార్థులకు పట్టాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

పొన్నవరంలో సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం

"ఇదే వర్సిటీలో నేను కూడా చదివా. యూనివర్సిటీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మేము చదివేటప్పుడు వర్సిటీలో ఇన్ని గదులు లేవు. క్లాస్‌రూమ్‌ల కంటే క్యాంటీన్‌లోనే ఎక్కువ ఉండేవాళ్లం. గంటల తరబడి క్యాంటీన్‌లో చాలా విషయాలపై చర్చించేవాళ్లం. సమాజంలోని అనేక సమస్యలపై చర్చ జరిపేవాళ్లం. విద్యార్థి సంఘాల సమావేశంలో పలు అంశాలపై చర్చించేవాళ్లం. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి.. వాటికి పరిష్కారం చూపగలగాలి." - సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details