ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Purandeshwari Fire on YSRCP Govt: రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదు: పురందేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 9:43 PM IST

Purandeshwari Fire on YSRCP Govt: రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా.. రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

Purandeshwari_Fire_on_YSRCP_Govt
Purandeshwari_Fire_on_YSRCP_Govt

Purandeshwari Fire on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా.. రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన.. ఏ ఒక్క హామీనీ వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

BJP Kisan Morcha Program Updates: విజయవాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా చిగురుపాటి కుమారస్వామి, ఇతర సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల నిర్వహణను గాలికొదిలేశారని పురందేశ్వరి మండిపడ్డారు. అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నా.. సాగుదారులకు మేలు కలిగించే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆమె దుయ్యబట్టారు.

Purandeswari Comments on AP Liquor Policy : 'మద్య నిషేధం హామీ ఏమైంది..? లిక్కర్ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి'

Purandeshwari Comments: ''కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలకు స్టిక్కర్లు వేసుకుని, ప్రయోజనం పొందాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో పంటలు పండించలేని దుస్థితి నెలకొంది. వైసీపీ పాలనలో రైతుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. రాష్ట్రంలోని సాగునీటి సమస్యలను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. సాగునీరు లేక, వర్షాలు కురవక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. అసలు.. ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించారు..? అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏం చేసింది..? ఈ రాష్ట్రంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరో ప్రజలకు తెలుసా..?'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Purandeshwari on Liquor Manufacturing Companies Names: మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రభుత్వం బయట పెట్టాలి : పురందేశ్వరి

Satyakumar Comments:అనంతరం బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రసంగిస్తూ.. వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు చెందిన మంత్రులు రైతుల అవస్థలపై ఏమైనా సమీక్షలు చేశారా..? అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ఫసల్ బీమా యోజన అమలు కాకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదు: పురందేశ్వరి

''ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. కులాల మధ్య వైషమ్యాలు పెంచి, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించి ఓట్లు పొందుదామని ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. రైతాంగం గురించి గానీ, నిరుద్యోగ, మహిళల రక్షణ గురించి ఆలోచించడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించేందుకు డిసెంబర్ 1 నుంచి కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో గ్రామదర్శన యాత్ర చేపట్టబోతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.''-వై. సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి

Jada Shravan on Liquor Scam: దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే.. 'జే ట్యాక్స్'తో వేల కోట్ల దోపిడీ : జడ శ్రావణ్

ABOUT THE AUTHOR

...view details