ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RTC BUS FALLS IN TO VALLEY: ఎగువ అహోబిలం రహదారిలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

By

Published : Nov 29, 2021, 11:57 AM IST

Updated : Nov 29, 2021, 2:08 PM IST

rtc-bus-plunges-into-valley-on-upper-ahobilam-road
ఎగువ అహోబిలం రహదారిలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

11:56 November 29

బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలు

ఎగువ అహోబిలం రహదారిలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

RTC BUS ACCIDENT IN KURNOOL: కర్నూలు జిల్లా అహోబిలం వద్ద నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే క్రమంలో వెనక్కి తిప్పుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ పోలీసులు.. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని బయటకు తీసి రెండు అంబులెన్సుల ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:bus accident: బస్సు బోల్తా...27 మందికి గాయాలు

Last Updated : Nov 29, 2021, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details