కర్నూలు జిల్లా మాధవరం మండలం రాచమర్రి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఆటోలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
కర్నూలు జిల్లా రాచమర్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
![రెండు ఆటోలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు one man died in a road accident at rachamarri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11429364-894-11429364-1618592724489.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి