ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

By

Published : Nov 14, 2020, 5:59 AM IST

కర్నూలు జిల్లా అదోనిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై అక్రమ మద్యం తరలిస్తున్న ఈరన్న గుర్తు తెలియని వాహనం ఢీకొని దుర్మరణం పాలయ్యాడు.

గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా అదోనిలో ద్విచక్ర వాహనంపై అక్రమ మద్యం తరలిస్తున్న ఈరన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మదిరే గ్రామ క్రాస్ దగ్గర సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆదోనికి చెందిన యువకుడు మృతి చెందాడు.

అదోనికి అక్రమ రవాణా..

మృతి చెందిన యువకుడు కర్ణాటక ప్రాంతం నుంచి ఆదోనికి అక్రమ రవాణా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనలో ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details