ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Buddha Prasad Arrest టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్​ అరెస్ట్​.. అవనిగడ్డలో పరిస్థితితి ఉద్రిక్తం

By

Published : Jun 17, 2023, 3:13 PM IST

Mandali Buddha Prasad Arrest: మట్టి అక్రమ రవాణాపై కృష్ణా జిల్లా నాగాయలంక తహశీల్దార్ కార్యాలయం ముట్టడికి బయలు దేరిన టీడీపీ నేత బుద్ధప్రసాద్​ను పోలీసులు అరెస్టు చేశారు. అవనిగడ్డలోని ఆయన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Mandali Buddha Prasad Arrest
Mandali Buddha Prasad Arrest

Mandali Buddha Prasad Arrest: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో సాగుతున్న మట్టి మాఫియా ఆగడాలను నిలువరించాలని కోరుతూ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నిర్వహించ తలపెట్టిన నాగాయలంక తహశీల్దార్ కార్యాలయ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. అవనిగడ్డలోని బుద్ధప్రసాద్ ఇంటి వద్ద నుంచి కార్యకర్తలతో కలిసి నాగాయలంక బయలుదేరిన బుద్ధప్రసాద్​ను ఇంటి బయటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు ఓ వైపు అడ్డగిస్తుండగానే బుద్ధప్రసాద్​ను పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. దీంతో పోలీసుల వాహనానికి కార్యకర్తలు అడ్డుగా బైఠాయించారు.

Buddha Prasad Arrest News: కార్యకర్తలను పక్కకు తప్పించి.. పోలీసులు బుద్ధప్రసాద్​ను 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోడూరు పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఒకానొక సమయంలో బుద్ధ ప్రసాద్ పడిపోయే పరిస్థితి నెలకొంది. దోపిడీని అడ్డుకోవాలని తాము గాంధేయ మార్గంలో నిరసన తెలియజేస్తామంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమనీ.. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు ఇలా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని బుద్ధప్రసాద్​ అన్నారు. అవనిగడ్డలో డాక్టర్ శ్రీహరి హత్య కేసును ఛేదించటంలో విఫలమైన పోలీసులు.. ఇలా తమపై ప్రతాపం చూపించడం పోలీస్ శాఖకు సిగ్గు చేటని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసినా ఈ ఉద్యమం ఆగదనీ.. ప్రజా ఉద్యమం కొనసాగుతుందని.. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తామని బుద్ధప్రసాద్​ ప్రకటించారు.

"దోపిడీని అడ్డుకోవాలని నేను గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు ఇలా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. అవనిగడ్డలో డాక్టర్ శ్రీహరి హత్య కేసును ఛేదించటంలో విఫలమైన పోలీసులు.. ఇలా మాపై ప్రతాపం చూపించడం పోలీస్ శాఖకు సిగ్గు చేటు. నన్ను అరెస్ట్ చేసినా ఈ ఉద్యమం ఆగదు. ప్రజా ఉద్యమం కొనసాగుతుంది. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తాం"- మండలి బుద్ధప్రసాద్, మాజీ ఉప సభాపతి

కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అరెస్టు: మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్​ పిలుపు మేరకు నాగాయలంక తహశీల్దార్​ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి కోడూరు పోలీస్ స్టేషన్​కు తరలించారు.

పోలీసుల తీరును ఖండించిన టీడీపీ నేతలు: మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తామంటే.. అరెస్టు చేయడం ఎంటని ప్రశ్నించారు. పోలీసులు తీరును ఖండించారు. మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకునే వరకు పోరాటం ఆపేదిలేదని తేల్చిచెప్పారు.

టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్​ అరెస్ట్​.. అవనిగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు

ABOUT THE AUTHOR

...view details