ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగనన్న కాలనీ కబ్జా... ఇళ్లస్థలాలు ఆక్రమించి.. అంతటితో ఆగకుండా

By

Published : Sep 19, 2022, 4:36 PM IST

YSRCP LEADERS OCCUPIED LANDS
YSRCP LEADERS OCCUPIED LANDS ()

YSRCP LEADERS OCCUPIED LANDS : పేదలకు పంపిణీ చేసిన జగనన్న ఇళ్ల స్థలాలను కొందరు నాయకులు కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా దానిని చదును చేసి వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇదంతా చేసింది ప్రతిపక్షాలో లేక గిట్టనివారో కాదు. స్వయానా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే??

YSRCP LEADERS OCCUPIED JAGANANNA LANDS : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడిబ్రోలులో పేదలకు పంపిణీ చేసిన జగనన్న ఇళ్ల స్థలాలను ఆ పార్టీకే చెందిన నేతలు కబ్జా చేశారు. సుమారు 4 ఎకరాలను ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇళ్లస్థలాలు కబ్జా చేసి పొలం వేసుకుంటే.. తాము ఇళ్లు ఎలా నిర్మించుకుంటామని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహనిర్మాణశాఖ అధికారులు నిత్యం అక్కడే ఉంటున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తెలుగుదేశం, జనసేన నాయకులు నిరసన తెలిపారు. ఇళ్లస్థలాల్లో వ్యవసాయం చేస్తుంటే.. ఇళ్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు.

జగనన్న కాలనీ కబ్జా.. ఇళ్లస్థలాలు ఆక్రమించి వ్యవసాయం చేస్తున్న వైకాపా నేతలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details