ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు

By

Published : Oct 25, 2020, 5:43 PM IST

గుంటూరు జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించి, కొత్త వాహనాలకు పూజలు నిర్వహించారు.

vijaya dasami celebrations
గుంటూరులో ఘనంగా విజయదశమి వేడుకలు

విజయదశమి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పలు ఆలయాల్లో దుర్గాదేవి, లలితా పరమేశ్వరి, భద్రకాళి రూపాల్లో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. దుర్గ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. తమ కొత్త వాహనాలను తెచ్చి పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

ఇవీ చూడండి..

తెలంగాణకు నిలిచిన ఆర్టీసీ సేవలు.. బోసిపోతున్న గుంటూరు బస్టాండ్

ABOUT THE AUTHOR

...view details