ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో మంకీఫాక్స్ అనుమానిత కేసు

By

Published : Jul 30, 2022, 4:02 AM IST

గుంటూరులో మంకీఫాక్స్ అనుమానిత కేసు
గుంటూరులో మంకీఫాక్స్ అనుమానిత కేసు

రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్​లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు.

రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్ లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు..... ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details