ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​..

By

Published : Mar 14, 2021, 11:26 AM IST

గుంటూరు జిల్లాలో కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు బారులు తీరారు.

mlc elections
గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సరళి

గుంటూరు జిల్లాలో కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. రెండు జిల్లాల్లో మెుత్తం 111 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13,505 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఓటరు తనకు నచ్చిన అభ్యర్ధి పేరుకు ఎదురుగా తొలి ప్రాధాన్యతను సూచిస్తూ.. ఒకటో నెంబర్ అంకె వేయాల్సి ఉంటుంది. తర్వాత క్రమంలో మిగతా వారికి కూడా 2,3,4 అంకెలు వేయవచ్చు. తొలి ప్రాధాన్యమున్న ఓటు వేయకుండా.. 2,3,4 అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లదని అధికారులు స్పష్టం చేశారు.

చిలకలూరిపేటలో...

చిలకలూరిపేటలో కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ఆర్వీఎస్సీఎస్ హైస్కూల్​లోని పోలింగ్ కేంద్రాల్లో.. ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 283మంది ఓట‌ర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇదీ చదవండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details