ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్​.. ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందంటూ..

By

Published : Jan 31, 2023, 10:13 AM IST

Updated : Jan 31, 2023, 10:37 AM IST

Chiru tweet on Taraka health
Chiru tweet on Taraka health ()

CHIRU TWEET ON TARAKA RATNA HEALTH: తారకరత్నకు ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనాన్ని అందించిందని మెగాస్టార్​ చిరంజీవి తెలిపారు. తారకరత్న ఆరోగ్యంపై ట్విట్టర్​ వేదికగా ఆయన స్పందించారు.

CHIRANJEEVI TWEET ON TARAKA RATNA HEALTH : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు.

‘‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుంచి అతడిని కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను డియర్‌ తారకరత్న’’ అంటూ ట్వీట్‌ చేశారు.

విషమంగానే తారకరత్న ఆరోగ్యం: గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేరిన సినీనటుడు నందమూరి తారకరత్నకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొననసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య నివేదికను విడుదల చేశారు. ‘తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పైనే ఆయనకు అత్యున్నత స్థాయి చికిత్స అందిస్తున్నాం. మాధ్యమాల్లో ప్రచారమవుతున్నట్లు ఆయనకు ఎక్మో వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. తారకరత్న కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిపై సమాచారాన్ని అందిస్తున్నాం’ అని తాజా నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిత్యం తారకరత్న కుటుంబసభ్యులతోనే ఉంటూ వైద్యులతో సంప్రదిస్తున్నారు. సోమవారం కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న ఆస్పత్రికి వచ్చి, తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించారు.

అసలేం జరిగిందంటే: ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌, ఇతర స్పెషలిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 31, 2023, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details