ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్రవాహనం.. వరికోత మిషన్ ఢీ... యువకుడు మృతి

By

Published : May 5, 2021, 9:17 PM IST

ద్విచక్రవాహనం, వరికోత మిషన్ ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బొమ్మరాజుపల్లి వద్ద జరిగింది.

man death in a road accident at bommarajupalli guntur district
ద్విచక్రవాహనం-వరికోత మిషన్ ఢీ... యువకుడు మృతి

గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కారంపూడి మండలం గాదెవారిపాలెం గ్రామానికి చెందిన రామారావు... తన అత్తగారి గ్రామమైన బొమ్మరాజుపల్లికి వచ్చాడు.

ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా బొమ్మరాజుపల్లి మలుపు వద్ద వరికోత మిషన్​ను ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన రామారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details