ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagananna Vidya deevena: విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డు కాకూడదు: సీఎం జగన్

By

Published : Nov 30, 2021, 12:34 PM IST

Updated : Nov 30, 2021, 6:07 PM IST

Jagananna Vidya Deevena funds release: విద్యార్థులు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకూడదని..,పెద్ద స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డు కాకూడదని సీఎం జగన్‌ అన్నారు. పేదలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్న ఉద్దేశంతోనే..పూర్తి ఫీజు రీయింబర్స్​మెంట్ అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో విడత విద్యా దీవెన కింద 9 లక్షల 87 వేల 965 మంది తల్లుల ఖాతాలకు రూ.686 కోట్ల నగదును సీఎం విడుదల చేశారు. విద్యా దీవెన పథకం ద్వారా 21 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని జగన్ తెలిపారు.

jagananna vidhya deevena news
జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధుల విడుదల

జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల

Jagananna Vidya deevena: జగనన్న విద్యాదీవెన మూడో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాదీవెన డబ్బులను సీఎం జగన్ విడుదల చేశారు. దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు సంబంధించి 9 లక్షల 87 వేల 965 మంది తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లను విడుదల చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్థులకు విద్యాదీవెన ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు తెలిపారు. పేదలు పెద్ద చదువులు చదివేందుకు, పెద్ద స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. పేద పిల్లలకు అండగా నిలబడేందుకే పూర్తి ఫీజు రీఎంబర్స్​మెంట్ అమలు చేస్తున్నామన్నారు. పేదరికం పోవాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా ప్రతి వర్గంలో నుంచి పిల్లలు మంచి చదువులు చదవాలన్నారు. పెద్ద చదువులు చదివితేనే పేదల తలరాతలు మారతాయని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1,778 కోట్లు బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించిందన్న సీఎం..జగనన్న విద్యా దీవెన ద్వారా ఇప్పటివరకు మొత్తం 6,259 కోట్లు చెల్లించిందన్నారు. 21 లక్షల 48 వేల 477 మంది విద్యార్థులకు విద్యాదీవెన పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు.

CM Jagan: విద్యా వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకువచ్చామని సీఎం జగన్..గతంలో అరకొరగా ఫీజులు ఇచ్చే వారని, వీటిని సమూలంగా మార్పులు చేసి ఫీజుమొత్తాన్నంతా చెల్లిస్తున్నామన్నారు. అర్హులైన పేద విద్యార్థులకు వందకు వంద శాతం ఫీజు రీఎంబర్స్​మెంట్ అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే పీజీ కోర్సులకూ ఫీజు రీఎంబర్స్​మెంట్ అమలు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులే నేరుగా ఫీజలు చెల్లించడం ద్వారా కళాశాలలపై పర్యవేక్షణ పెరుగుతుందని, కళాశాలలో వసతులను తల్లులు పరిశీలించి లోటు పాట్లుంటే యాజమాన్యాలను ప్రశ్నిస్తారన్నారు. దీనివల్ల కళాశాలలకు జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. సమస్యలపై 1902 నెంబర్​కు ఫోన్ చేస్తే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఫీజులను సకాలంలో తప్పనిసరిగా కళాశాలకు చెల్లించాల్సిన బాధ్యత తల్లులపై ఉందన్న జగన్...అలా చేయకపోతే కళాశాలల అకౌంట్లకే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Vidya deevena funds : డిగ్రీ కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. డిగ్రీలో ఇంగ్లీషు మీడియం వైపు అడుగులు వేస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో ఇంగ్లీష్, మరో పేజీలో తెలుగును ముద్రిస్తున్నామన్నారు. డిగ్రీ కోర్సులను ఉద్యోగాలు ఇచ్చే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏకంగా 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నామన్న సీఎం.. ఒక స్కిల్‌ యూనివర్సిటీని కూడా తీసుకువస్తున్నామన్నారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు తీసుకు వస్తున్నామన్న సీఎం.. విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్డీయూ యూనివర్శిటీని, కురుపాంలో ఇంజినీరింగ్‌ కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీని, కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీని, పాడేరులో మెడికల్‌ కాలేజీ తీసుకువస్తున్నామన్నారు. నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 880 కోట్లతో పనులకు శ్రీకారం చుడుతున్నామని, మరో 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తవుతాయన్నారు.

ఇదీ చూడండి:Atchannaidu: రెండున్నరేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం: అచ్చెన్నాయుడు

Last Updated : Nov 30, 2021, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details