ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM

By

Published : Dec 13, 2022, 12:59 PM IST

.

MLA Muttamshetty Srinivasa Rao
ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

  • తప్పుపట్టిన బాటలోనే.. వైసీపీ సర్కార్..! టెండర్లు పిలవకుండానే ప్రాజెక్టుల అప్పగింత
    Allocation of pumped storage projects : ప్రైవేటు సంస్థలకు ప్రాజెక్టులు కేటాయించేటప్పుడు రాష్ట్రానికి కలిగే మేలు ఏంటన్నది బేరీజు వేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పారదర్శకతకు పెద్దపీట వేసేలా అన్ని అంశాలనూ పరిగణించాలి. కానీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా కేవలం నామినేషన్‌పై ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చేతికి అప్పగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నిధులివ్వనప్పుడు సమావేశాలకు ఎందుకు పిలుస్తారు! వైసీపీ సర్పంచ్ ఆగ్రహం
    Sarpanch fires on govt.: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం సరిపడ నిధులు ఇవ్వకపోవడంపై అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్షానుపల్లి వైకాపా సర్పంచ్ లింగన్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రతి ఒక్క నియోజకవర్గంలో అసమ్మతి ఉంది : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Peddireddy Ramachandra Reddy : ప్రతి ఒక్క నాయకుని పైన అసమ్మతి సహజమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురంలో నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీ ఎంఆర్డీఏ చట్టం సెక్షన్-15లో సవరణలు చేసిన.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
    AP MRDA Act amended Section-15 AP State Govt: మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ ఏపీ ఎంఆర్డీఏ చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఏపీ ఎంఆర్డీఏ చట్ట సవరణ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ పరిధిలో ఇటీవలే అమలులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మన సైనికులెవరూ ప్రాణాలు కోల్పోలేదు'.. తవాంగ్ సెక్టార్​లో ఘర్షణపై రాజ్​నాథ్
    భారత్-చైనా దళాల మధ్య జరిగిన తాజా ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ లోక్​సభలో ప్రకటన చేశారు. చైనా దళాల దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పట్టపగలే మహిళను గన్​తో బెదిరించి గొలుసు చోరీ చేసిన దొంగ
    ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో​ ఓ దొంగ పట్టపగలే రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి గొలుసును కాజేశాడు. అక్కడే ఉన్న ఓ యువకుడు తనకు అడ్డు రావడం వల్ల అతడి వద్దనున్న మొబైల్​ ఫోన్​ను సైతం ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయ్‌ జాగ్రత్త!'.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
    ప్రస్తుత సీజన్‌లో కరోనాతో పాటు ఇతర రకాల వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ల వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు పౌరులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫిఫా వరల్డ్​ కప్​కు మరో ప్రత్యేక ఆకర్షణ.. కొత్త బంతి చూశారా?
    ఆసక్తికరంగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ జత కానుంది. జరగబోయే మ్యాచ్​ల కోసం ఓ కొత్త బంతి సిద్ధం కానుంది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • NTR 30: తారక్​ రోల్​పై ఇంట్రెస్టింగ్​ అప్డేట్​.. ఎక్స్​ట్రా ఫింగర్ ఎలిమెంట్​తో
    కొరటాల శివ-తారక్ కాంబినేషనల్​లో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 గురించి ఓ అదిరిపోయే ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details